News January 12, 2025
అల్లుడి బైక్ ఢీకొని మామ మృతి

శ్రీ సత్యసాయి జిల్లా రొళ్ల మం. చిగమంత్ ఘట్టలో బైక్ ఢీకొని వ్యక్తి మృతిచెందాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిత్తప్ప పొలానికి వెళ్లి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో తన అల్లుడు మహేశ్ ద్విచక్ర వాహనంపై అజాగ్రత్తగా వెళ్లి చిత్తప్పను ఢీ కొన్నాడు. ఘటనలో అతడికి గాయాలయ్యాయి. ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతిడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Similar News
News August 7, 2025
నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టాడని మహిళ సూసైడ్

గుంతకల్లు సోఫియా వీధికి చెందిన షమీం భాను(35) తన భర్త ఫోన్ లిఫ్ట్ చేయలేదని, బ్లాక్ లిస్టులో పెట్టాడని మనస్తాపంతో పురుగుమందు తాగి బుధవారం ఆత్మహత్య చేసుకుంది. భాను మొదటి భర్తకు విడాకులు ఇచ్చి గుంతకల్లు సచివాలయ వీఆర్ఓ మహమ్మద్ వలిని గతేడాది వివాహం చేసుకుంది. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలో బుధవారం తన నంబర్ బ్లాక్ లిస్టులో పెట్టడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనంతపురం తరలిస్తుండగా మృతిచెందింది.
News August 7, 2025
రైతు కళ్లలో కారం చల్లి రూ.30 వేల పెన్షన్ డబ్బు చోరీ

వృద్ధ రైతు కళ్లలో కారం పొడి చల్లి రూ.30 వేలు చోరీ చేసిన ఘటన బ్రహ్మసముద్రం మండలం మాముడూరులో బుధవారం చోటుచేసుకుంది. పొలంలో ఉండగా గుర్తు తెలియని దుండగులు కళ్లలో కారం పొడి చల్లి తన వద్ద ఉన్న రూ.30 వేలు చోరీ చేశారని బాధిత రైతు భూతప్ప తెలిపారు. నెలనెలా పోగేసుకున్న పింఛన్ డబ్బులు మొత్తం దోచుకెల్లారని వాపోయారు. ఘటనపై స్థానిక పోలీసు స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు.
News August 7, 2025
నిధుల పెంపు, GST మినహాయింపు కోసం లోక్ సభలో ఎంపీ ప్రస్తావన

నిధుల పెంపు & GST మినహాయింపు కోసం లోక్ సభలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో తాగునీటి కొరత, రహదారి లేమి, అభివృద్ధి లోపాలు వంటి సమస్యలు రాజ్యమేలుతున్నాయన్నారు. MPLADS కింద ఎంపీకి రూ.10 కోట్లకు పెంచాలన్నారు. MPLADS పనులకు పూర్తిగా GST మినహాయింపు ఇవ్వాలని కోరారు. MPLADSలో తక్షణ మార్పులు చేపట్టాలన్నారు.