News March 19, 2025

అల్లూరిలో 92మంది దూరం

image

అల్లూరి జిల్లాలో మొత్తం 71 పరీక్షా కేంద్రాల్లో బుధవారం టెన్త్ హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని DEO. బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,548మంది విద్యార్థులకు 11,45 మంది హాజరయ్యారు. 92మంది పరీక్షలకు ఆబ్సెంట్ అయ్యారని తెలిపారు. 99.20శాతం హాజరు నమోదైయిందని చెప్పారు. సరివేలు, ముంచింగిపుట్టు, జోలాపుట్టు పరీక్ష కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు.

Similar News

News January 22, 2026

జనగామ: కారు ఢీకొని యువకుడి మృతి

image

జనగామ సమీపంలోని పెంబర్తి కమాన్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా కేంద్రానికి చెందిన సిజాహిద్ (22) అలియాస్ సిజ్జు తన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా, వెనక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 22, 2026

CCMBలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

CSIR-సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (<>CCMB<<>>) 4 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి బీఎస్సీ, పీజీ (నేచురల్ సైన్సెస్, మాలిక్యులర్ బయాలజీ), BE/BTech, MBBS, PhD అర్హతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ccmb.res.in

News January 22, 2026

GNT: ప్రియుడుతో కలిసి భర్తను చంపిన భార్య.. పోలీసుల అదుపులో నిందితులు

image

దుగ్గిరాల(M) చిలువూరులో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటనలో ప్రియురాలు సహా ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మృతుడి భార్య లక్ష్మి మాధురి, ప్రియుడు గోపిలను దుగ్గిరాల ఎస్సై వెంకట రవి విచారిస్తున్నారు. భర్తను చంపిన తర్వాత డెడ్‌బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసినట్లు విచారణలో తేలింది. దిండుతో ఊపిరాడకుండా హత్య చేసి గుండెపోటుతో మరణించాడని నమ్మబలికిన విషయం తెలిసిందే.