News March 9, 2026
అల్లూరి: ఇంటర్ పరీక్షలకు 124 మంది గైర్హాజర్

ఉమ్మడి అల్లూరి జిల్లాలో సోమవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 124 మంది విద్యార్థులు ఆబ్సెంట్ అయ్యారని పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్ పరీక్ష జరిగింది. అల్లూరి జిల్లాలో 504 మందికి గాను 459 మంది రాశారని, పోలవరం జిల్లాలో 504కి గాను 459 మంది రాశారని తెలిపారు. చింతూరు ZPHS పరీక్ష కేంద్రాన్ని ఏజెన్సీ DEO మల్లేశ్వరావు తనిఖీ చేశారు.
Similar News
News April 14, 2026
DANGER: వేసవిలో ఇవి తింటే..

సమ్మర్లో అధిక నూనె ఉండే బజ్జీలు, పకోడీలు, చిప్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కు దూరంగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. వీటి వల్ల అలసట, ఎసిడిటీ వస్తాయని, జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. అలాగే స్వీట్లు, ప్యాకేజ్డ్ జ్యూసులు, షుగర్ ఎక్కువగా ఉండే కూల్డ్రింక్స్ తాగొద్దని, వీటి వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రాసెస్ చేసిన, ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచించారు.
News April 14, 2026
ఒంటిమిట్టలో 45 డిగ్రీల ఉష్ణోగ్రత

AP: కడప(D) ఒంటిమిట్టలో ఇవాళ 45°C ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల(D) సంజామల 44.2°C, తిరుపతి(D) వరదయ్యపాలెంలో 43.8°C ఉష్ణోగ్రత నెలకొంది. 262 మండలాల్లో 40°Cలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు SDMA MD ప్రఖర్ జైన్ తెలిపారు. రేపు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయన్నారు. ఉత్తరాంధ్రలో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఎండతీవ్రత దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.



