News February 11, 2026
అల్లూరి: ఊబిలో చిక్కుకొని వ్యక్తి మృతి

మత్స్యగెడ్డ వద్ద ఊబిలో చిక్కుకొని తమర్భ వెంకటరమణ(38) మృతి చెందాడు. పెదబయలు మండలం అరడకోటకు చెందిన వెంకటరమణ బుధవారం వేలంబొడ్డ గ్రామానికి వెళ్లడానికి బోటుతీసే యత్నంలో జారిపడి ఊబిలో కూరుకుపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ముంచంగిపుట్టు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News February 12, 2026
చిత్తూరు: 17న ఈ ట్యాబ్లెట్లు తీసుకోండి..!

చిత్తూరు జిల్లాలో ఈనెల 17 నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించనున్నట్లు DMHO సుధారాణి తెలిపారు. జిల్లాలో 1-19 ఏళ్లలోపు మొత్తం 3,62,535 మంది పిల్లలు, యువతకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 1-5 ఏళ్లలోపు 77,318 మంది చిన్నారులు ఉండగా, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 2,84,060 మందికి.. బడి బయట ఉన్న1157 మందికి మాత్రలు అందిస్తామన్నారు.
News February 12, 2026
విజయవాడలో మిస్టరీ.. పార్కింగ్ చేసిన కారులో శవం..!

గుణదల ఏలూరు రోడ్డులోని పవర్ ఆఫీస్ ఎదురుగా పార్కింగ్ చేసి ఉన్న ఓ కారులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గత మూడు నెలలుగా ఆ కారు అక్కడే నిలిపి ఉంచినట్లు స్థానికులు చెబుతున్నారు. కారులో మృతదేహాన్ని గమనించిన జనం గురువారం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. నిలిపి ఉంచిన కారులోకి మృతుడు ఎలా వచ్చాడనేది మిస్టరీగా మారింది.
News February 12, 2026
తమిళనాడులో ఇన్స్టాగ్రామ్ ఎలక్షన్స్!

తమిళనాడులో అటు నేతలు, ఇటు జెన్ జీ ఎలక్షన్స్ ఎదుర్కొంటున్నాయి. నేతలంతా ప్రజల్లో ఉంటూ ఆకట్టుకునే ప్రకటనలు, ప్రామిస్లు చేస్తుంటే, తాము ఆ మీటింగుల్లో ఉన్నామంటూ యువత ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ వైరల్ కావడంపై ఫోకస్ పెట్టింది. నేతలతో సెల్ఫీ, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసి ఇన్స్టాలో రీల్స్ చేయడం, మిగతా వారికంటే ఎంత వేగంగా వైరల్ అవుతున్నామో చూసుకోవడంలో బిజీగా ఉంటున్నారట.


