News October 6, 2025
అల్లూరి: ఘాట్ రోడ్డులో మృతదేహం

కొయ్యూరు మండలం బూదరాళ్ల నుంచి పెదవలస వెళ్లే మార్గంలో బొంతువలస ఘాట్ రోడ్డులో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి మృతదేహం కలకం రేపింది. మృతుడు అడ్డతీగల మండలం డి.కొత్తూరుకు చెందిన బొదిరెడ్డి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. అతను నాలుగు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 13, 2026
ఈ నెల 30 దాకా రేషన్ పంపిణీ!

TG: 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తుండటంతో రేషన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పుడు తీసుకోకపోతే మళ్లీ 3 నెలల వరకు ఇవ్వరని ప్రజలు బారులు తీరుతున్నారు. దీంతో ఉదయం నుంచే క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్ సమస్యలు, ఈపోస్ మెషీన్లు ఆగిపోవడం, స్టాక్ అయిపోవడంతో చాలా మందికి ఇంకా రేషన్ అందలేదు. దీంతో ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని, ఈ నెల 30 దాకా రేషన్ ఇస్తామని అధికారులు చెబుతున్నారు.
News April 13, 2026
తూప్రాన్: తల్లిదండ్రులకు విజయాన్ని అంకితం చేసిన శ్రావణి

తూప్రాన్ ఎంజేపీ బాలికల కళాశాల విద్యార్థిని శ్రావణి ఇంటర్ ఎంపీసీలో 950 మార్కులతో సత్తా చాటింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా.. పట్టుదలతో చదివి ఈ విజయం సాధించింది. టెన్త్ బోనాల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసిన శ్రావణి.. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ఇంటర్లో రాణించింది. తన విజయాన్ని అమ్మానాన్నలకు అంకితం చేస్తున్నట్లు తెలిపింది. భవిష్యత్తులో గ్రూప్-1 సాధించడమే తన లక్ష్యమని శ్రావణి పేర్కొంది.
News April 13, 2026
సిద్దిపేట TSRSలో 100 శాతం ఉత్తీర్ణత

సిద్దిపేట జిల్లా తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు సృష్టించింది. మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి పరీక్షలు రాసిన మొత్తం 159 మంది విద్యార్థులు పాస్ అయ్యారని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా సెకండియర్లో అర్చన 1000కి 994 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచింది. విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది.


