News November 18, 2025
అల్లూరి: ‘చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి’

రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని రగిలించిన మహోన్నత వ్యక్తి కనకదాసు అని కలెక్టర్ దినేశ్ కుమార్ అన్నారు. భక్త కనకదాసు ఒక గొప్ప కవిగా, తత్వవేత్తగా, అపారమైన సామాజిక సంస్కర్తగా అందించిన సేవలను దేశం స్మరించుకుంటోందన్నారు. మంగళవారం భక్త కనకదాసు జయంతిని కలెక్టరేట్లో నిర్వహించారు. అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 18, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్లకు FULL DEMAND

తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం వాహన నంబర్ల ఫీజులను పెంచింది. 9999 వంటి ప్రముఖ నంబర్కు ఇప్పుడు రూ.1.5 లక్షలు అయ్యాయి. హైదరాబాద్లో TG 09 సిరీస్కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒకే నంబర్కు అనేక మంది దరఖాస్తు చేసే పరిస్థితుల్లో రవాణా శాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అలాగే ఓవర్ ల్యాపింగ్ అప్లికేషన్లకు ఆన్లైన్ వేలంపాట విధానం ప్రవేశపెట్టి పారదర్శకతను పెంచుతోంది.
News November 18, 2025
HYD: ఫ్యాన్సీ నంబర్లకు FULL DEMAND

తెలంగాణ ప్రభుత్వం ప్రీమియం వాహన నంబర్ల ఫీజులను పెంచింది. 9999 వంటి ప్రముఖ నంబర్కు ఇప్పుడు రూ.1.5 లక్షలు అయ్యాయి. హైదరాబాద్లో TG 09 సిరీస్కు భారీ డిమాండ్ కొనసాగుతోంది. ఒకే నంబర్కు అనేక మంది దరఖాస్తు చేసే పరిస్థితుల్లో రవాణా శాఖ కొత్త కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. అలాగే ఓవర్ ల్యాపింగ్ అప్లికేషన్లకు ఆన్లైన్ వేలంపాట విధానం ప్రవేశపెట్టి పారదర్శకతను పెంచుతోంది.
News November 18, 2025
త్వరలో అన్ని ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ECG మెషీన్లు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్, హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులకు అల్ట్రా సౌండ్, ఈసీజీ మెషీన్ వంటి ముఖ్యమైన వైద్య పరికరాలను అందజేస్తానని కేంద్రమంత్రి బండి సంజయ్ వెల్లడించారు. వేములవాడ ఏరియా ఆసుపత్రికి రూ.కోటిన్నర విలువ చేసే వైద్య పరికరాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ.. కేంద్రం పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ఉందన్నారు.


