News March 23, 2025
అల్లూరి జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..

అల్లూరి రాజవొమ్మంగి పరిసర గ్రామాల్లో ఆదివారం స్కిన్లెస్ బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 260కి, స్కిన్తో రూ. 240కి విక్రయించారు. గత వారం కంటే కిలో కి రూ. 20 పెరిగిందని వ్యాపారులు తెలిపారు. పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, చింతూరు ఏరియాల్లో దాదాపు ఇదే రేటు పలికింది. వచ్చే రోజుల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఆదివారం 10 టన్నుల వరకు చికెన్ అమ్ముడు అవుతుందని తెలిపారు.
Similar News
News July 9, 2025
క్యాబినెట్ భేటీ కీలక నిర్ణయాలివే..

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ సమావేశమైన మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. * రూ.672 కోట్ల ధాన్యం బకాయిల విడుదలకు అంగీకారం * హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు ఆమోదం * అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం, వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏర్పాటుకు నిర్ణయం * కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు అనుమతి * నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణకు ఆమోదం
News July 9, 2025
MBA కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలోని MBA కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-డే), ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్లాగ్, ఎంబీఏ (ఈవినింగ్), ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్మెంట్-ఈవినింగ్) నాలుగో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ పరీక్షలను వచ్చేనెల 5వ తేదీ నుంచి నిర్వహిస్తామన్నారు.
News July 9, 2025
రైతుబజార్ను వినియోగించుకోవాలి: సిరిసిల్ల డీఏవో

సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ ఘాట్ రైతుబజార్ను కూరగాయలు, మటన్, చికెన్, చేపల విక్రయదారులు వినియోగించుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిణి అఫ్జల్బేగం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం కూరగాయల వ్యాపారులను బతుకమ్మ ఘాట్ రైతుబజార్లోకి తరలించేందుకు అవసరమైన షెడ్లను నిర్మిస్తున్నామన్నారు. అదే విధంగా ఈ రైతుబజార్లోకి మాంసం షాప్లను సైతం తరలించాలని చెప్పారు.