News December 13, 2025

అల్లూరి జిల్లాలో నవోదయ పరీక్షకు 1,352 మంది గైర్హాజరు

image

అల్లూరి జిల్లాలో నవోదయ ఎంట్రన్స్ పరీక్షలకు 1,352మంది గైర్హాజరు అయ్యారని పరీక్షల కన్వీనర్ ప్రసాద్ తెలిపారు. 16పరీక్ష కేంద్రాల్లో 6వ తరగతి ప్రవేశానికి మొత్తం 3,493మంది హాజరు కావాల్సి ఉండగా 2,141మంది పరీక్షలు రాశారని తెలిపారు. అడ్డతీగలలో రెండు పరీక్ష కేంద్రాలను ఆయన పరిశీలించారు. అన్ని చోట్ల ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయన్నారు.

Similar News

News December 16, 2025

కౌలు రైతులకు ₹లక్ష వరకు పంట రుణం

image

AP: కౌలు రైతులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారు పంటలు సాగు చేసుకునేందుకు రుణాలివ్వాలని DCCBలను ఆదేశించింది. రైతులు PACS సభ్యత్వం, ఆ పరిధిలో నివాసం, కౌలుపత్రం కలిగి ఉండాలి. ఎకరాకు తక్కువ కాకుండా భూమి ఉండాలి. ₹లక్ష వరకు రుణమిస్తారు. రైతులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా ఏర్పడి రుణాలు పొందవచ్చు. రుణాన్ని వడ్డీతో ఏడాదిలోపు చెల్లించాలి. కాగా డీకేటీ, అసైన్డ్ భూముల్లో వ్యవసాయం చేసే వారికి రుణాలు రావు.

News December 16, 2025

ఈనెల 19న ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే: కలెక్టర్‌

image

ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డే కార్యక్రమాన్ని ఈనెల 19న మధ్యాహ్నం 12.30 గంటలకు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతినెలా మూడో శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల గ్రీవెన్స్‌ డేను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News December 16, 2025

కామారెడ్డి జిల్లాలో మూడో విడత పోలింగ్ రేపే!

image

కామారెడ్డి జిల్లాలో మూడో విడత జీపీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 168 జీపీలు ఉండగా 26 GPలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన జీపీలకు గాను 462 సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,482 వార్డుల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా, 449 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2,790 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు.