News March 26, 2025
అల్లూరి జిల్లాలో పరీక్షలకు 101 మంది దూరం

అల్లూరిలో బుధవారం జరిగిన 10వ తరగతి ఫిజికల్ సైన్స్ పరీక్షకు 101 మంది గైర్హాజరు అయ్యారని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. మొత్తం 11,606 మంది విద్యార్థులు రాయవలసి ఉండగా 11,505 మంది హాజరయ్యారని తెలిపారు. 99 శాతం హాజరు నమోదు అయ్యిందన్నారు. డుంబ్రిగూడ, హుకుంపేట మండలాల్లో 8 పరీక్షా కేంద్రాలను ఆయన తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
Similar News
News March 29, 2025
KMR: వేసవిలో చోరీలు తస్మాత్ జాగ్రత్త: SP

వేసవిలో చోరీల నివారణకు KMR జిల్లా SP రాజేశ్ చంద్ర ప్రజలకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళ ఆరుబయట నిద్రించే సమయంలో ఒంటిపై ఆభరణాలు ధరించొద్దన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని DVRని రహస్య ప్రదేశంలో ఉంచాలన్నారు. తమ టూర్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో షేర్ చేయొద్దన్నారు. ఊళ్లకు వెళ్లే వారు ఇంట్లో లైటు వేసి ఉంచాలన్నారు. కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News March 29, 2025
సింగరకొండలో అరటి పండ్లతో పూజలు

అద్దంకి మండలంలోని సింగర కొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం అమావాస్య సందర్భంగా స్వామివారికి పదివేల అరటి పండ్లతో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారు ప్రత్యేక అలంకరణ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు.
News March 29, 2025
అన్నమయ్య: బాలుడిపై అఘాయిత్యం.. వ్యక్తి అరెస్ట్

అన్నమయ్య జిల్లాలో బాలుడిపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సంబేపల్లి ఎస్ఐ భక్తవత్సలం కథనం మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 9ఏళ్ల బాలుడు ఈనెల 27సాయంత్రం ఇంటి వద్ద సైకిల్ తొక్కుతున్నాడు. అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రమేశ్ బాలుడికి మాయమాటలు చెప్పి ఆటోలో తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.