News February 26, 2025
అల్లూరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రేపు(గురువారం) పాడేరు డివిజన్లో అన్ని విద్యా సంస్థలకు స్థానిక సెలవుగా ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే రంపచోడవరం, చింతూరు డివిజన్ల పరిధిలో పోలింగ్ కేంద్రాలు కేటాయించిన భవనాలు ఉన్న సంస్థలకు సెలవు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అన్ని యాజమాన్య పాఠశాలలు ఆదేశాలు పాటించాలని సూచించారు.
Similar News
News February 27, 2025
పోసానిపై పలు జిల్లాల్లో కేసులు

AP వ్యాప్తంగా పలు జిల్లాల్లో సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై కేసులు నమోదయ్యాయి. CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్, లోకేశ్ను అసభ్యకరంగా దూషించారని బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, చిత్తూరు(D) యాదమరి, తిరుపతి(D) పుత్తూరు, మన్యం(D) పాలకొండ, కర్నూలు, శ్రీకాకుళంలో ఫిర్యాదులు అందగా, కొన్నిచోట్ల కేసులు నమోదయ్యాయి. 2 రోజుల క్రితం అన్నమయ్య(D) ఓబులవారిపల్లె పీఎస్లో నమోదైన కేసులో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.
News February 27, 2025
హనుమకొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

✓ HNK: ఆధ్యాత్మిక సమ్మేళన కార్యక్రమానికి హాజరైన మాజీమంత్రి హరీశ్ రావు
✓ MLC ఎన్నికలను విజయవంతం చేద్దాం: CP
✓ HNK: ఎన్నికల పోలింగ్ మెటీరియల్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
✓ బంగారు ఆభరణాలతో జాగ్రత్తగా ఉండాలి: HNK ACP
✓ హైదరాబాదుకు దీటుగా వరంగల్ అభివృద్ధి: MP కడియం కావ్య
✓ పోలింగ్ కేంద్రాలను సందర్శించిన సెంట్రల్ జోన్ డీసీపీ
News February 27, 2025
విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లు రీ షెడ్యూల్

విశాఖ మీదుగా నడిచే పలు రైళ్లను నేడు రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి 22:45 గంటలకు బయలుదేరాల్సిన హౌరా – SMV బెంగుళూరు SF ఎక్స్ప్రెస్ గురువారం తెల్లవారుజామున 2 గంటలకు హౌరాలో బయలుదేరనుంది. సికింద్రాబాద్ – విశాఖ గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ఈరోజు రాత్రి గంట ఆలస్యంగా 9.30 గంటలకు విశాఖలో బయలుదేరనుంది. ప్రయాణీకులు గమనించాలని కోరారు.