News March 1, 2026
అల్లూరి జిల్లాలో పెరిగిన చికెన్ ధర

అల్లూరి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు పెరిగాయి. బ్రాయిలర్ కిలో చికెన్ రూ.260 నుంచి 280 వరకు పాడేరు, చింతపల్లి, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాల్లో విక్రయిస్తున్నారు. స్కిన్ లెస్ మరో రూ.20 అదనంగా అమ్ముతున్నామని వ్యాపారులు తెలిపారు. చేపలు కిలో రూ. 230 నుంచి 250 వరకు అమ్ముతున్నారు. మేక మాంసం రూ. 800 పలికిందని తెలిపారు.
Similar News
News March 1, 2026
ఖమేనీ అంతం… US తదుపరి అడుగులు ఏమిటి

ఇరాన్ ‘సుప్రీం’ ఖమేనీని అంతం చేసిన US అక్కడి ప్రభుత్వ మార్పుపై ఏం చేయబోతుందనేది ఆసక్తిగా మారుతోంది. ఇరాక్లో సద్దాం అంతం అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనా US అండతోనే పాలన సాగింది. వెనిజులాలో అధ్యక్షుడు మదురోను అరెస్టు చేసినా అక్కడి ప్రభుత్వాన్నే కొనసాగించింది. అయితే ఇరాన్లో అలా సాధ్యం కాదని, భిన్నమైన వ్యూహంతో వెళ్లొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్గత కలహాలతో GOVT కూలిపోవచ్చంటున్నారు.
News March 1, 2026
పోకో, రెడ్మీ ఫోన్ల ధరలూ పెరిగాయి

ఇప్పటికే వివో, iQOO, శాంసంగ్ సంస్థలు <<19253401>>ఫోన్<<>> ధరలు పెంచేయగా.. ఈ లిస్ట్లో ఇప్పుడు మరో రెండు బ్రాండ్లు చేరాయి. పోకో తన C75, M7, C85, M7 ప్లస్, F7 మోడళ్లలోని వివిధ వేరియంట్లపై ₹1000-₹2500 వరకు ధరలు పెంచింది. ఇకపై పోకోలో బేస్ మోడల్ ఫోన్ ధర ₹10,999గా ఉండనుంది. ఈ హైక్ ఈరోజే అమలులోకి రానుంది. రెడ్మీ సైతం ఇదే స్థాయిలో పెంచినట్లు సమాచారం. మెమొరీ చిప్ల కొరతతో కంపెనీలు ధరలు పెంచాల్సి వస్తోంది.
News March 1, 2026
నెలకు రూ.74వేల జీతం.. NPCILలో ఉద్యోగాలు

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(<


