News September 2, 2024

అల్లూరి జిల్లాలో ముగ్గురు ఉద్యోగులు సస్పెండ్

image

అల్లూరి జిల్లా జీ.మాడుగుల మండలం బంధవీధి ఆశ్రమ పాఠశాలలో ఐటీడీఏ పిఓ అభిషేక్ తనిఖీ చేశారు. విద్యార్థుల అదృశ్యం పట్టించుకోకపోవడంపై ప్రధానోపాధ్యాయులు, డిప్యూటీ వార్డెన్, కుక్‌లకు పీఓ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. వారం రోజులుగా విద్యార్థులు బయట ఉంటే ఏమి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యవేక్షణ లోపంపై డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూఓ తిరుపాల్‌లను మందలించారు.

Similar News

News January 8, 2026

విశాఖలో రేపటి నుంచి లైట్ హౌస్ ఫెస్టివల్‌

image

విశాఖలోని రేపటి నుంచి రెండు రోజులు పాటు లైట్ హౌస్ ఫెస్టివల్ పేరిట కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూరి అశోక్ వెల్లడించారు. ఎంజీఎం పార్కు మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ ఫెస్టివల్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని అధికారులు తెలిపారు.

News January 8, 2026

విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

image

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.

News January 8, 2026

విశాఖలో జనవరి 9న డిజిటల్ టెక్ సమ్మిట్

image

రెండో ఎడిషన్ AP డిజిటల్ టెక్నాలజీ సమ్మిట్-2026 ఈనెల 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ సదస్సు ఉ.9.15 నుంచి సా.5.30 గంటల వరకు VMRDA చిల్డ్రన్స్ అరీనాలో జరగనుంది. సదస్సు తొలి రోజు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరవుతారు. 2వ రోజు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొననున్నారు. ఈ సదస్సుకు IT, AI నిపుణులు, స్టార్టప్ ప్రతినిధులు, పరిశోధక విద్యార్థులతో సహా సుమారు 800 మంది హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు.