News October 29, 2025
అల్లూరి జిల్లాలో రేపు ప్రైమరీ పాఠశాలలకు సెలవు

మొంథా తుఫాను నేపథ్యంలో ఈనెల 30 గురువారం అల్లూరి జిల్లాలోని ప్రైమరీ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ దినేశ్ కుమార్ బుధవారం తెలిపారు. అప్పర్ ప్రైమరీ పాఠశాలలు యథావిధిగా నడవాలని సంబంధిత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పునరావాస కేంద్రాలకు తరలించిన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నూనె కేజీ, కందిపప్పు కేజీ, ఉల్లిపాయలు కేజీ, బంగాళా దుంపలు కేజీ, పంచదార కేజీ అందిస్తున్నామన్నారు.
Similar News
News October 30, 2025
ప్రకాశం: UG పరీక్షలు వాయిదా

మొంథా తుఫాన్ కారణంగా ఆంధ్ర కేసరి యూనివర్సిటీ పరిధిలోని అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకు జరగాల్సిన గ్రాడ్యుయేట్ (UG) 3, 5వ సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వీటిని తిరిగి నవంబర్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొ. డీవీఆర్ మూర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
News October 30, 2025
అనకాపల్లి: నేడు కూడా కొనసాగనున్న పునరావాస కేంద్రాలు

మొంథా తుఫాన్ తీరం దాటినా పునరావాస కేంద్రాలు గురువారం కూడా కొనసాగుతాయని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. జిల్లాలో 78 పునరావాస కేంద్రాల్లో 3,993 మంది ఆశ్రయం పొందుతున్నారు. కేంద్రాల్లో వీరికి భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు. పునరావాస కేంద్రాలకు మండల స్థాయి అధికారులు ఇన్ఛార్జ్లుగా వ్యవహరిస్తున్నారు.
News October 30, 2025
ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ సౌకర్యాలు.. తొలుత కొడంగల్లో

TG: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా వసతులు కల్పించేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోనుంది. తొలుత ప్రయోగాత్మకంగా కొడంగల్లో చేపట్టనున్నారు. స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు, ఇంటర్నెట్, లైబ్రరీలు, క్రీడా మైదానాలు వంటివి ఏర్పాటు చేస్తారు. టీచర్లు, స్టూడెంట్స్కు ID కార్డులు, 8-10th స్టూడెంట్స్కు IIT, NEET ఫౌండేషన్ మెటీరియల్ అందిస్తారు.


