News May 7, 2025

అల్లూరి జిల్లాలో 24 మంది హెచ్‌ఎంలకు మెమోలు

image

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో 81 శాతం కంటే తక్కువ విద్యార్థులు పాస్ అయిన పాఠశాల హెచ్‌ఎం‌లకు మెమోలు జారీ చేశామని DEO బ్రాహ్మజీరావు శనివారం తెలిపారు. అల్లూరి జిల్లాలో మొత్తం 44 పాఠశాలలు ఉండగా 24 పాఠశాలల్లో తక్కువ శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు. ఈనెల 28 నుంచి ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు అంతా తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Similar News

News April 13, 2026

నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, ​పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, ​యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 13, 2026

NGKL: జిల్లాలో పెరుగుతున్న ఎండలు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సిర్సనగండ్ల, పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా కల్వకుర్తి, జటప్రోలు, లింగాల తదితర ప్రాంతాల్లోనూ పార 41 డిగ్రీలు దాటింది. భానుడి భగభగలకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం నుంచే వడగాల్పులు వీస్తుండటంతో అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావడం లేదు.

News April 13, 2026

CMR జడ్జి కోర్టులో ఘనంగా పద్మం సిల్వర్ జువెలరీ ప్రారంభం

image

పద్మం సిల్వర్ జువెలరీ వారి మరొక శాఖను జడ్జి కోర్టు ఎదురుగా గల CMR షాపింగ్ మాల్‌లో CMR గ్రూపు సంస్థల డైరెక్టర్ మావూరి బాలాజీ, సతీమణి హారికతో కలిసి ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఒక లక్ష రూపాయల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా,రూ.50 వేల విలువైన సిల్వర్ జువెలరీ కొనుగోలుపై రూ.25 వేల విలువైన సిల్వర్ జువెలరీ ఉచితంగా అందిస్తున్నామన్నామని బాలాజీ తెలిపారు.