News March 29, 2025

అల్లూరి జిల్లాలో 99 మంది దూరం

image

అల్లూరి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 99 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని DEO బ్రాహ్మజిరావు తెలిపారు. జిల్లాలో మొత్తం 71 పరీక్ష కేంద్రాల్లో 11,659 మంది విద్యార్థులు బయాలజికల్ సైన్స్ రాయవలసి ఉండగా 11,560 మంది రాసారని, 99.15 శాతం హాజరు అయ్యారని తెలిపారు. హుకుంపేట, పాడేరు మండలాల్లో 4 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

Similar News

News March 31, 2025

కేజీహెచ్‌లో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు

image

విశాఖ కేజీహెచ్‌లో ఏప్రిల్ 1 నుంచి అన్ని పని రోజులలో సూపర్ స్పెషాలిటీ ఓ.పి. సేవలు ఉంటాయని కేజీహెచ్ సూపరింటెండ్ శివానంద్ సోమవారం తెలిపారు. గతంలో ఒక్కో రోజు ఒక్కొక్క సూపర్ స్పెషాలిటీ వైద్యానికి ఓ.పి.విభాగాలు పని చేసేవన్నారు. కానీ రేపటి నుంచి అన్ని పనిదినాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 2 నుంచి సా.4 వరకు ఓ.పి. చూస్తారని వెల్లడించారు. ప్రజలు గమనించాలని కోరారు.

News March 31, 2025

ప్రకాశం: ఇవాళ అర్ధరాత్రి వరకే ఛాన్స్

image

ఉగాది సందర్భంగా దోర్నాల-శ్రీశైలం మార్గంలో ఈనెల 27 నుంచి 24 గంటలూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ(సోమవారం)అర్ధరాత్రి 12 గంటలకు మాత్రమే వాహన రాకపోకలకు అనుమతులు ఉంటాయని దోర్నాల ఫారెస్ట్ రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. 12 గంటల తర్వాత వాహనాలను నిలిపివేస్తామని చెప్పారు. వాహనదారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News March 31, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు

image

* కర్ణాటక భక్తులతో పోటెత్తిన మహానంది క్షేత్రం* రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్* ఈద్గాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు* బేతంచర్ల ఈద్గాలో నల్ల బ్యాడ్జిలతో నిరసన * బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తపై దాడి* ఈకేవైసీ గడువును సద్వినియోగం చేసుకోండి: కొలిమిగుండ్ల MRO * వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన

error: Content is protected !!