News November 11, 2025
అల్లూరి జిల్లాలో CIల బదిలీ

అల్లూరి జిల్లాలో సీఐలను బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి ఆదేశాలు జారీ చేశారు. NDPS టాస్క్ఫోర్స్ CIగా పనిచేస్తున్న సువారి రాముని విశాఖ రేంజ్కి బదిలీ చేశారు. విశాఖ రేంజ్లో ఉన్న AS లక్ష్మణరావుని ఆ స్థానంలో నియమించారు. విజయనగరం DCRBలో పనిచేస్తున్న సుధాకర్ను జిల్లాలోని GK విధి CIగా బదిలీ చేస్తూ DIG ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News November 11, 2025
బిహార్ ఎన్నికలు: 9 గంటల వరకు 14.55% పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 14.55% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. 122 నియోజకవర్గాలకు జరుగుతున్న పోలింగ్లో ఓటు వేసేందుకు ఓటర్లు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన మగధ్, చంపారన్, సీమాంచల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మొదటి విడతలో 64.66% పోలింగ్ నమోదైన సంగతి తెలిసిందే.
News November 11, 2025
భద్రాద్రి పాలకమండలి ఏర్పాటుపై పడని ముందడుగు

భద్రాద్రి రామాలయానికి ఉమ్మడి ఏపీలో 2012 NOV 25 వరకు ట్రస్ట్ బోర్డు పనిచేసింది. అనంతరం పాలకమండలి ఏర్పాటుపై గత ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో పాలకమండలి ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 50మందికి పైగా దరఖాస్తు సమర్పించారు. అయినా నేటికి పాలకమండలి ఏర్పాటుపై అడుగు ముందుకు పడలేదు. 3రోజుల క్రితం సర్కారు సిగ్నల్ ఇవ్వడంతో మరోసారి నోటిఫికేషన్ విడుదల కానుంది.
News November 11, 2025
చంద్రగిరిలో అక్రమ మైనింగ్.. పవన్ కళ్యాణ్ హెచ్చరిక

ఎమ్మెల్యే పులివర్తి నాని అనుచరుల ఆధ్వర్యంలో చంద్రగిరిలో రూ.కోట్ల విలువైన మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని JSP నేత దేవర మనోహర్.. తిరుపతి పర్యటనలో పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ విచారణకు ఆదేశించారు. రామచంద్రాపురం, గుండోడుకణం, రాయలచెరువు, గణేషపురం, తిరుచానూరు, తనపల్లి ప్రాంతాల్లో తవ్వకాలు కొనసాగుతున్నాని మనోహర్ తెలపగా.. ప్రజల ఆస్తుల రక్షణలో రాజీ ఉండవద్దని పవన్ హెచ్చరించారు.


