News October 29, 2025

అల్లూరి జిల్లా కలెక్టర్ పేరిట ఫేక్ అకౌంట్..!

image

సైబర్ నేరగాళ్లు ఏకంగా అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్ పేరిట ఒక ఫేక్ సోషల్ మీడియా అకౌంట్‌ను సృష్టించారు. ప్రస్తుతం ఈ అంశం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ దినేశ్ కుమార్ పేరిట మెసెంజర్‌లో నకిలీ అకౌంట్‌ను సృష్టించి, డబ్బులు కావాలని పలువురికి మెసేజ్‌లు పెడుతున్నారు. మంగళవారం ఈ విషయం వెలుగులోకి రావడంలో కలెక్టర్ అప్రమత్తమయ్యారు. ఈ మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ సూచించారు.

Similar News

News October 29, 2025

KPHBలో RAIDS.. మహిళలు, యువతులు అరెస్ట్

image

కూకట్‌పల్లిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. ACP రవికిరణ్ నేతృత్వంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు KPHB మెట్రో స్టేషన్, పుల్లారెడ్డి స్వీట్ షాప్, మెట్రో పరిసర ప్రాంతాల్లో రైడ్స్ చేశారు. యువకులు, వాహనదారులను ఇబ్బంది పెడుతోన్న 11 మంది మహిళలు, యువతులను అదుపులోకి తీసుకొన్నారు. న్యాయమూర్తి ముందు హాజరు పరిచి బైండోవర్ చేశారు. ఆరుగురికి 7 రోజుల రిమాండ్‌ విధించారు.

News October 29, 2025

భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

TG: మొంథా తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రేపు పలు జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. సిద్దిపేట, కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో హాలిడే ఇచ్చారు. అటు ఉమ్మడి కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో సెలవు ఇవ్వాలని విద్యార్థులు, పేరెంట్స్ కోరుతున్నారు.

News October 29, 2025

కాకినాడ జిల్లాలో సెలవులు క్యాన్సిల్

image

తుఫాన్ నేపథ్యంలో కాకినాడ జిల్లాకు ఈనెల 31 వరకు ముందు సెలవులు ప్రకటించారు. మంగళవారం రాత్రి తుఫాన్ తీరం దాటంతో జిల్లాలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈక్రమంలో గురువారం నుంచి విద్యాసంస్థలు తెరవాలని కలెక్టర్ షాన్‌మోహన్ ఆదేశాలు జారీ చేశారు. కోనసీమ జిల్లాలో సైతం గురువారం నుంచే స్కూళ్లు, కాలేజీలు తెరుచుకోనున్నాయి.