News January 1, 2026
అల్లూరి: డీఈవోకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన ఉపాధ్యాయులు

మన్యం జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ గురువారం సాలూరు వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక బాలికొన్నత పాఠశాలలో సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ..ఈ కొత్త సంవత్సరం అందరికీ శుభాలు కలగాలని ఆకాక్షించారు. వీరితో పాటు డిప్యూటీ డీఈవో రాజ్ కుమార్, సాలూరు, పాచిపెంట మండలాలకు చెందిన ఎంఈఓలకు, ఉపాధ్యాయ బృందాలు అభినందనలు తెలిపారు.
Similar News
News February 21, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,580
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,334
* 10 గ్రాముల వెండి ధర రూ.2,680.
News February 21, 2026
చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం: సీఎం చంద్రబాబు

AP: YCP పాలనలో 108L మె.ట.ల చెత్త పేరుకుపోవడంతో ప్రజలు రోగాల బారిన పడ్డారని CM CBN ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే చెత్తను తొలగిస్తున్నామన్నారు. పల్నాడు(D) వినుకొండలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’లో ఆయన ప్రసంగించారు. ‘మున్సిపాలిటీల్లో 97% చెత్త సేకరిస్తున్నాం. గ్రామాల్లో మార్చికల్లా 100% డోర్ టు డోర్ కలెక్ట్ చేస్తాం. ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
News February 21, 2026
సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్ను సృష్టిస్తుంది.


