News January 3, 2026

అల్లూరి: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన ఎస్.రామయ్య (38) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ రమేశ్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ చెప్పిన వివరాల మేరకు.. తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న రామయ్య ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.

Similar News

News January 11, 2026

జగిత్యాల: అక్షరాయుధంతో ఎదిరించిన అలిశెట్టి!

image

తెలంగాణ నేల గర్వించదగ్గ మహాకవి అలిశెట్టి ప్రభాకర్. <<18824184>>జగిత్యాల<<>> జిల్లాలో జన్మించిన ఆయన, అక్షరాన్నే ఆయుధంగా మలచుకుని సామాజిక అన్యాయాలపై పోరాడారు. ‘సిటీ లైఫ్’ పేరుతో HYD జనజీవనాన్ని తన కవితల్లో కళ్లకు కట్టారు. చిత్రకారుడిగా ప్రస్థానం మొదలుపెట్టి, మినీ కవితా ప్రక్రియలో మేటిగా నిలిచారు. పేదరికం, అనారోగ్యంతో పోరాడుతూనే చివరి శ్వాసవరకు కలం వీడలేదు. నేడు ఆయన సాహిత్యం భావి తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

News January 11, 2026

జగిత్యాల: అరుదైన కవి.. జయంతి, వర్ధంతి ఒకే రోజు!

image

నిర్భాగ్యుల గొంతుకైన కవి, తెలంగాణ శ్రీశ్రీగా పేరుగాంచిన జగిత్యాలకు చెందిన దివంగత అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి జనవరి 12 (1954–1993)ఒకే రోజు కావడం విశేషం. వృత్తి ఫొటో గ్రాఫర్. ప్రవృత్తి కవిగా సిటీలైఫ్, పరిష్కారం, వేశ్య, దృశ్యం, నిర్మొహమాటం, ఎర్రపావురాలు, రక్తరేఖ, కాలం గొలుసు, చురకలు వంటి అక్షర తూటాలను సమాజంపై సంధించిన ప్రభాకర్ తెలుగు సాహిత్యంలో తనకంటూ ఒక పేజీని సృష్టించుకుని పదిలపరుచుకున్నారు.

News January 11, 2026

ప.గో: వారికి ‘బిరులు’… వీరికి ‘సిరులు’!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పందాల జోరు మొదలైంది. నిర్వాహకులు బిరుల (పందెం బరి) ఏర్పాటులో నిమగ్నమవగా, ఖాకీలు, ఖద్దరు నేతలకు ఇది కాసుల వర్షం కురిపిస్తోంది. పందెం మొత్తంలో 5 నుంచి 10 శాతం వాటా లేదా రోజువారీ మామూళ్ల కోసం పోలీస్ స్టేషన్లలో బేరాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. పండుగ 3రోజులకు ముందే ముడుపులు చెల్లించాలని కొందరు, రోజువారీ ఫీజు కట్టాలని మరికొందరు నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.