News March 14, 2025
అల్లూరి: మహిళా టీచర్లు మాత్రమే అర్హులు

సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయడానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అదనపు సమన్వయకర్త స్వామి నాయుడు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ జడ్పి ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళ టీచర్లు అర్హులన్నారు. ఈనెల 13 నుంచి 19 వరకు దరఖాస్తులు తమ కార్యాలయంలో స్వీకరిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News March 15, 2025
బుమ్రా తెలివిగా ఆలోచించాలి: మెక్గ్రాత్

గాయాల విషయంలో భారత బౌలర్ బుమ్రా తెలివిగా వ్యవహరించాలని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ మెక్గ్రాత్ సూచించారు. ‘తను యువకుడు కాదు. వయసు పెరిగే కొద్దీ ఫాస్ట్ బౌలర్లకు గాయాల ప్రమాదం మరింత ఎక్కువ. నేను తక్కువ వేగంతో బౌలింగ్ చేసేవాడిని కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ బుమ్రా వంటి ఫాస్ట్ బౌలర్లు అప్రమత్తంగా ఉండాలి. జిమ్లో శరీరాన్ని దృఢపరచుకోవాలి. భారత్కు అతడి సేవలు అత్యవసరం’ అని పేర్కొన్నారు.
News March 15, 2025
VKB: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
News March 15, 2025
యాదాద్రి: ఆర్టీసీ బస్సు ఢీ.. వ్యక్తికి తీవ్రగాయాలు

యాదాద్రి జిల్లా ఆత్మకూర్ఎం మండల కేంద్రంలోని రాయగిరి-మోత్కూరు ప్రధాన రహదారిపై తిమ్మాపురం క్రాస్ రోడ్డు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొందని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రికి తరలించారు. గాయపడిన తిమ్మాపూర్కు చెందిన చామల రమేశ్గా గుర్తించారు.