News February 1, 2025
అల్లూరి: రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి(UPDATE)
అల్లూరి జిల్లా ఎటపాక మండలం గోపాలపురం గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కంటైనర్, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రమాద స్థలంలోనే అక్కడికక్కడే మృతిచెందారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా ఎటపాక మండలం కన్నాపురం గ్రామానికి చెందిన ఇద్దరు తమ సమీప బంధువులు భద్రాచలంలోని ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం ఉండడంతో బంధువులను పరామర్శించడానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఘటన జరిగిందన్నారు.
Similar News
News February 2, 2025
ఉప్పు గనుల్లో ఉంచి చికిత్స చేస్తారు!
ఆస్తమా రోగులకు వినూత్నంగా చికిత్స అందిస్తోంది ఉక్రెయిన్. అక్కడున్న ఉప్పు గనుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రిసార్ట్ ఉబ్బసం రోగులకు ట్రీట్మెంట్ ఇస్తోంది. గనిలోని అధిక ఉప్పు సాంద్రత ఒక మైక్రోక్లైమేట్ను సృష్టించి ఊపిరితిత్తులను పొడిగా ఉంచడంలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. రోగులు గనిలోనే కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నమ్ముతారు.
News February 1, 2025
భారీగా పెరిగిన జీఎస్టీ కలెక్షన్లు
దేశంలో జనవరి నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. 12.3శాతం పెరిగి రూ.1,95,506 కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ రూ.1.47 లక్షల కోట్లు కాగా, దిగుమతి వస్తువులపై విధించిన పన్నులతో వచ్చిన ఆదాయం రూ.48,382 కోట్లుగా ఉంది. రీఫండ్స్ కింద రూ.23,853 కోట్లు విడుదల చేయగా, చివరకు వసూళ్లు రూ.1.72 లక్షల కోట్లుగా ఉన్నాయి.
News February 1, 2025
కొండంత రాగం తీసి కూసంత పాట: షర్మిల
AP: బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు కొండంత రాగం తీసి కూసంత పాట పాడినట్లు ఉందని షర్మిల ఎద్దేవా చేశారు. 12మంది MPలు ఉన్న నితీశ్కు బడ్జెట్లో అగ్రతాంబూలం అందుకుంటే, 21మంది MPలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబుకు చిప్ప చేతిలో పెట్టారన్నారు. ప్రత్యేకహోదా ప్రస్తావన లేకుండా రాష్ట్ర ప్రజల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. ఇంత అన్యాయం జరిగితే CM బడ్జెట్ను స్వాగతించడం హాస్యాస్పదమన్నారు.