News April 24, 2024
అల్లూరి: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను డీఐజీ విశాల్ గున్ని వెల్లడించారు. సీపీఐ మావోయిస్టు యూజీ క్యాడర్కి చెందిన ఆరుగురు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారన్నారు. గతంలో వీరిపై రూ.19 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా, తదితర అధికారులు పాల్గొన్నారు.
Similar News
News April 21, 2025
ఆనందపురం: రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన శరీరం

ఆనందపురం మామిడిలోవ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆనవాళ్లు గుర్తు పట్టలేనంతగా మృతదేహం నుజ్జునుజ్జైంది. హిట్ అండ్ రన్ కేసుగా భావిస్తూ దర్యాప్తు చేస్తున్నామని ఆనందపురం ఎస్సై సంతోష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 21, 2025
ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంటెక్ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు ఇవాళ విడుదల అయ్యాయి. జనవరిలో నిర్వహించిన రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేసి ఏయు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. పరీక్ష ఫలితాలు విడుదల చేసిన తేదీ నుంచి 15 రోజుల్లోగా రీవాల్యుయేషన్ కోసం విద్యార్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
News April 21, 2025
వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మరో 170 మంది తొలగింపు

విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి మరో 170 మందినియాజమాన్యం తొలగించింది. ఇప్పటివరకు 1500 వరకు ఉద్యోగులను తొలగించారు. అయితే కార్మిక సంఘాలతో జరిగిన చర్చల్లో మే 20వరకు ఎటువంటి చర్యలు ఉండవని చెప్పిన యాజమాన్యం తొలగింపులు ఆపడం లేదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కాగా ఉన్నపలంగా ఉద్యోగాలు పోవడంతో కార్మికులు బోరున విలపిస్తున్నారు.