News March 21, 2025

అల్లూరి: ‘సెల్ టవర్లకు త్వరితగతిన కనెక్షన్లు ఏర్పాటు చేయండి’

image

అల్లూరి జిల్లాలో సెల్ సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని, నిర్మాణాలు పూర్తయిన సెల్ టవర్లకు ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేసి కనెక్షన్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో వివిధ నెట్వర్క్ సంస్థలతో సమావేశం నిర్వహించారు. సెల్ టవర్ల కోసం అనేక గ్రామాల నుంచి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ముందుగా మంజూరైన సెల్ టవర్లను పనిచేసే స్థితికి తీసుకు రావాలని ఆదేశించారు.

Similar News

News February 11, 2026

ఇక్కడ స్నానం చేస్తే పాపాలు పోతాయట

image

ఒడిశాలోని బింకా సమీపంలో మహానది తీరాన ఉన్న పాపాక్షయ ఘాట్‌కు 900 ఏళ్ల చరిత్ర ఉంది. బ్రాహ్మణ హత్య దోషంతో బాధపడిన అనంగ భీమదేవుడు ఇక్కడ స్నానం చేసి విముక్తి పొందాడని కథనం. ఓ ఆవు స్వయంగా పాలిచ్చిన చోట రాజు కపిలేశ్వర శివాలయాన్ని నిర్మించాడు. ఇక్కడి మహానదిలో స్నానం చేసి, శివుడిని దర్శించుకుంటే పాపాలు తొలగి మనశ్శాంతి కలుగుతుందని విశ్వాసం. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ఈ ఘాట్‌కు ఏటా ఎంతో మంది వస్తుంటారు.

News February 11, 2026

విజయవాడకు ఉపాధికి వచ్చారా..ఈ ఉచిత వసతి మీకోసమే

image

ఉపాధి కోసం విజయవాడ వచ్చిన నిరుద్యోగులకు వీఎంసీ-మెప్మా సంయుక్తంగా కలిచి ఉచిత వసతిని కల్పిస్తోంది. ఆధార్ కార్డు ఉంటే పైసా చెల్లించినవసరం లేకుండానే ఆశ్రయాన్ని ఇవ్వనుంది. వీరికి కోసం విద్యాధరపురం, రాణిగారితోట, గాంధీనగర్, వెహికల్ డిపో ప్రాంతాల్లో హాస్టల్స్‌ను ఏర్పాటు చేసింది. భోజన వసతి, టీవీ బెడ్ తదితర సౌకర్యాలను అందిస్తోంది.

News February 11, 2026

సోషల్ మీడియాలో ఫేక్ AI కంటెంట్.. కేంద్రం కీలక ఆదేశాలు

image

సోషల్ మీడియాలో AI కంటెంట్‌కు SM ప్లాట్‌ఫామ్‌లు తప్పనిసరిగా లేబుల్ వేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. తప్పుదోవ పట్టించే లేదా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ తొలగింపు విషయంలో కోర్టు/ప్రభుత్వం ఆదేశించిన 3 గంటల్లోగా తొలగించాలని గడువు విధించింది. అంతకుముందు 36 గంటలు గడువు ఉండగా ఈ నెల 20 నుంచి ఈ ఉత్తర్వులు అమలుకానున్నాయి. AI కంటెంట్ దుర్వినియోగంపై యూజర్లకు 3 నెలలకోసారి అవగాహన కల్పించాలని తెలిపింది.