News January 7, 2026
అల్లూరి: స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలి

అల్లూరి, పోలవరం జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ శతశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మంగళవారం అధికారులను ఆదేశించారు. రేషన్ సరుకుల పంపిణీలో వచ్చే అవాంతరాలను అధిగమించాలన్నారు. స్మార్ట్ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు, తొలగింపు కార్యక్రమాలను సమగ్ర సమాచారంతో చేపట్టాలని సూచించారు. పెండింగ్లో ఉన్న రేషన్ కార్డు లబ్దిదారుల ఈ-కేవైసీ సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
Similar News
News February 6, 2026
మృతుడు మైలారం వాసి.. UPDATE

వెంకటాపూర్ మండలం వెలుతుర్లపల్లి క్రాస్ వద్ద గురువారం రాత్రి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు జయశంకర్ జిల్లా గణపురం మండలం మైలారం గ్రామానికి చెందిన రాజుగా స్థానికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన బండి నిఖిల్(మైలారం), ఇండ్ల సుమన్(కనిపర్తి), రాపూరి రాజేష్(గుంటూరు)కు చెందినవారుగా సమాచారం.
News February 6, 2026
అమలాపురం: బార్ల లైసెన్సులకు లాటరీ.. రూ.కోటి ఆదాయం

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మద్యం బార్ల లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.కోటి ఆదాయం సమకూరింది. ఐదు బార్లకు గాను నాలుగు బార్లకు శుక్రవారం అమలాపురంలో లాటరీ తీశారు. అమలాపురంలో రెండు, రామచంద్రపురంలో రెండు బార్లకు కేటాయింపులు జరిగాయి. ఒక్కో అభ్యర్థి రూ.5 లక్షల చొప్పున DD తీయగా.. ముమ్మిడివరంలో ఏడుగురు, అమలాపురంలో ఐదుగురు, రామచంద్రపురంలో ఎనిమిది మంది పోటీ పడ్డారు.
News February 6, 2026
నిర్మల్: రోడ్లకు మరమ్మతులు.. ప్రమాదాలు ఆగేనా..?

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ చొరవతో రహదారులకు మాహర్దశ రానుంది. జిల్లాలోని గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు, రోడ్ల వెంట లైటింగ్, సూచిక బోర్డులు, జీబ్రా క్రాసింగ్, అవసరమైన చోట్ల మార్కింగ్ వేయనున్నారు. నిర్మల్ టు బైంసా, ఖానాపూర్ వైపు ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. బైంసాలో జరిగిన ప్రమాదం అందరిని కలచివేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టనున్నారు.


