News March 29, 2025

అవనిగడ్డ: IPL బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు 

image

అయ్యప్ప నగర్‌లో లోకేశ్ ఆత్మహత్యతో IPL బెట్టింగ్ ముఠాల వ్యవహారం బయటపడింది. విజయవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ నెట్‌వర్క్‌ను ఛేదించేందుకు ప్రత్యేక బృందం ఏర్పాటైంది. దర్యాప్తులో అవనిగడ్డ MPP కుమారుడు పవన్ కుమార్ కీలక నిందితుడిగా బయటపడ్డాడు. అతడి బ్యాంక్ ఖాతాల్లో లక్షలాది రూపాయలున్నట్లు గుర్తించారు. బుకీలను పట్టుకునేందుకు పోలీసులు క్షుణ్ణంగా విచారణ కొనసాగిస్తున్నారు. 

Similar News

News March 31, 2025

అవనిగడ్డ: హైవేపై రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి

image

అవనిగడ్డ మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పులిగడ్డ సమీపంలోని టోల్ ప్లాజా వద్ద ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీ కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెనాలి వైపు నుంచి మోపిదేవికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. అవనిగడ్డ సీఐ, ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2025

కోడూరు: బాలికపై అనుచిత ప్రవర్తన..పోక్సో కేసు నమోదు 

image

కోడూరులో ఓ బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వరికూటి వేణు అనే వ్యక్తి, బాలిక ఇంట్లో ఉన్న సమయంలో అసభ్యంగా ప్రవర్తించగా, భయంతో బాలిక బయటకు పరుగెత్తింది. ఈ విషయాన్ని తల్లికి తెలపడంతో పెద్దలు రంగ ప్రవేశం చేశారు. అయితే, 2 రోజుల పాటు విషయం బయటకు రాకుండా చూసిన పెద్దలు, చివరికి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. 

News March 31, 2025

కృష్ణా: నేటి ‘మీకోసం’ కార్యక్రమం రద్దు 

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించే కార్యక్రమం రద్దయినట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే అర్జీ దారులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తదుపరి ‘మీకోసం’ కార్యక్రమం వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. 

error: Content is protected !!