News October 26, 2025

అవసరమైతే సెలవులు ఇవ్వండి: మంత్రి

image

మొంథా తుపా‌న్‍పై మన్యం, అల్లూరి జిల్లా కలెక్టర్లకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి పలు సూచనలు చేశారు. సోమవారం జరిగే గ్రీవెన్స్ రద్దు చేయాలని, అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు. వ్యాధులు ప్రబలే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అవసరమైతే సెలవులు ఇవ్వాలన్నారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు.

Similar News

News October 26, 2025

పార్వతీపురం: రేపు వర్షాల కారణంగా గ్రీవెన్స్ రద్దు

image

పార్వతీపురం జిల్లా కేంద్రంలో సోమవారం జరగబోయే ప్రజా సమస్యలు పరిష్కార వేదిక (గ్రీవెన్స్) రద్దు చేసినట్లు కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదివారం తెలిపారు. సోమవారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్న నేపథ్యంలో గ్రీవెన్స్ రద్దు చేశామని, ప్రజలు గమనించి సమస్యలు తెలపడం కోసం పార్వతీపురం రావద్దని పేర్కున్నారు.

News October 26, 2025

తుఫాను ఎఫెక్ట్.. TGలోనూ భారీ వర్షాలు

image

TGలోనూ ‘మొంథా’ ఎఫెక్ట్ ఉండొచ్చని HYD వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఈనెల 28న భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. కొమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈనెల 29న ADB, కొమురంభీం, మంచిర్యాల, NRML, PDPL, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

News October 26, 2025

రేపు PGRS రద్దు: కలెక్టర్

image

సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం తెలిపారు. మొంథా తుపాన్‌ కారణంగా సోమవారం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ప్రజా రక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. తుపాను పట్ల అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.