News May 20, 2024
అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలి: కలెక్టర్

జూన్ 4న కౌంటింగ్ అనంతరం గెలుపొందిన అభ్యర్థులతో ఊరేగింపులు, విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేనందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. అధిక మొత్తంలో బాణా సంచా విక్రయాలు చేపట్టవద్దని హోల్ సేల్ డీలర్స్ను ఆదేశిస్తున్నట్లు చెప్పారు. అధికారుల ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు.
Similar News
News March 2, 2026
GNT: అంబటికి వైసీపీ నేతల పరామర్శ

అంబటి రాంబాబును మాజీ మంత్రులు కొడాలి నాని, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, నంబూరు శంకరరావు ఆదివారం పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. తప్పుడు కేసులకు, అక్రమ అరెస్ట్లకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేదిలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులతో వైసీపీ మరింతగా బలోపేతం అవుతుందని చెప్పారు.
News March 1, 2026
అమరావతిలో పలు శంకుస్థాపనలు.. ప్రారంభాలు చేసిన CJI

అమరావతిలో ఏపీ హైకోర్టు అతిథి గృహానికి, జ్యూడిషియల్ అకాడమీకి సుప్రీంకోర్టు CJI జస్టిస్ సూర్యకాంత్ ఆదివారం శంకుస్థాపన చేశారు. దీంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల సముదాయాలు ప్రారంభించారు. రూ.210 కోట్లతో 33.20 ఎకరాల్లో 36మంది జడ్జీలకు బంగ్లాలు నిర్మించారు. సీజేఐతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు.
News March 1, 2026
GNT: గ్యాస్ డెలివరీ బాయ్స్కి జాయింట్ కలెక్టర్ వార్నింగ్

గ్యాస్ డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనపు వసూళ్లు చేయడం ఆపాలని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. కలెక్టరేట్ లోని శంకరన్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం LPGడిస్టిబ్యూటర్లు, చౌకధరల దుకాణదారులతో జేసీ సమీక్ష నిర్వహించారు. IVRSసర్వేలో రెండు ప్రశ్నలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చేలా పనితీరు మెరుగు పర్చుకోవాలని సూచించారు. వృద్దులకు ఇంటికి రేషన్ సరఫరా చేయకపోవడం కారణంగా కూడా వ్యతిరేకత వస్తుందన్నారు.


