News December 4, 2024
అవినీతి నిరోధక పోస్టర్ విడుదల చేసిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733225403392_20472010-normal-WIFI.webp)
డిసెంబరు 3నుండి 9వరకు జరిగే అవినీతి నిరోధక వారోత్సవాలలో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోస్టర్లను విడుదల చేశారు. అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో అవినీతి రహిత సమాజం ఆవశ్యకతను ఆమె నొక్కిచెప్పారు. రాష్ట్ర సీఎం కలలుగన్న బంగారు తెలంగాణకు అవినీతి రహిత సమాజం దారి చూపుతుందని ఉద్ఘాటించారు. ప్రజల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలన్నారు.
Similar News
News February 5, 2025
NLG: పరిషత్తు.. కసరత్తు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738726455899_50283763-normal-WIFI.webp)
మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించినా.. తాజాగా మండల జిల్లా పరిషత్ ఎన్నికలే మొదట నిర్వహిస్తామని చెబుతుండటంతో యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేస్తుంది. జిల్లాలో 33 జడ్పీటీసీలు, 352 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇప్పటికే సిద్ధంగా ఉన్న GP ఓటర్ల జాబితా ఆధారంగా ఎంపీటీసీ ఓటర్ల జాబితాను తయారు చేయనున్నారు.
News February 5, 2025
ఈనెల 7న బుద్ధవనంలో ‘త్రిపీటక పఠనోత్సవం’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738720758040_50015803-normal-WIFI.webp)
నాగార్జునసాగర్ హిల్ కాలనీ బుద్ధవనంలో ఈనెల 7న మహాబోధి సొసైటీ సికింద్రాబాద్, అంతర్జాతీయ త్రిపీటక సంగాయన మండలి ఆధ్వర్యంలో త్రిపీటక పఠనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బౌద్ధ ధార్మిక సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణ కోసం నిర్వహించే కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందిన 200 మంది బౌద్ధ బిక్షువులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
News February 5, 2025
NLG: బీడు భూముల్లో బంగారం పండిస్తున్నాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738718396007_691-normal-WIFI.webp)
నల్గొండ జిల్లా చందంపేట మండలం అంటేనే బీడు భూములు, కరువు కాటకాలతో కూడిన ప్రాంతం. భూగర్భ జలాలు లేక రైతులు అల్లాడుతుంటారు. ఆ బీడు భూముల్లోనే బంగారం పడిస్తున్నాడు రైతు పద్మారెడ్డి. వినూత్నంగా తన 12ఎకరాల్లో 1991లోనే 1200 కుంకుడు మొక్కలు నాటి ఎకరాకు రూ.5వేల పెట్టుడితో రూ.13లక్షల ఆదాయం పొందుతున్నాడు. ఎకరాకు 25 నుంచి 30 టన్నుల దిగుబడి సాధిస్తూ.. కిలో కుంకుడుకాయలు రూ.120 నుంచి రూ.150 వరకు విక్రయిస్తున్నాడు.