News April 25, 2024

అశ్వవాహనంపై కోదండ రాముడు

image

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి అశ్వ‌వాహ‌నంపై స్వామి వారు భక్తులకు ద‌ర్శ‌న‌మిచ్చారు. భక్తజన బృందాల మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి అశ్వవాహనంపై భక్తులకు కల్కి స్వరూపాన్ని ప్రకటించారు.  

Similar News

News April 23, 2025

కడప జిల్లా 10వ తరగతి పరీక్షల సమాచారం

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. కడప జిల్లాలో 27,800 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

News April 22, 2025

కడప జిల్లా నూతన జడ్జిని కలసిన ఎస్పీ

image

కడప జిల్లా నూతన జడ్జిగా యామిని నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్పీ ఇ.జి అశోక్ కుమార్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని చర్చించుకున్నారు. కేసుల పరిష్కారం, మహిళల భద్రత, నేరాల నివారణపై మాట్లాడుకున్నారు.

News April 22, 2025

దళితులకు అన్యాయం జరగకూడదు: కలెక్టర్

image

దళితులకు ఎక్కడా అన్యాయం జరగకూడదని, కడప జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలాని కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులను ఆదేశించారు. తన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి మానిటరింగ్ సమావేశం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరితగతిన పరిష్కారం చూపాలన్నారు.

error: Content is protected !!