News April 7, 2025

అశ్వారావుపేట: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

image

అశ్వారావుపేట శివారులో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాలు.. అశ్వారావుపేటకు చెందిన జీసీసీ రేషన్ డీలర్ భూక్యా కృష్ణ మండలం కావడిగుండ్లలో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో దొంతికుంట సమీపంలో వాగొడ్డుగూడెం వైపు వెళ్తున్న మరో బైక్ ఢీకొంది. ఈ ఘటనలో డీలర్ కృష్ణకు కుడికాలు విరగ్గా వాగొడ్డుగూడెంకు చెందిన నాగరాజు, గంగారంకి చెందిన రాజుకు గాయాలయ్యాయి.

Similar News

News February 20, 2026

విశాఖ: గుర్తింపు కార్డు ఉంటేనే ఏయులోకి అనుమతి!

image

కొన్ని రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో భద్రతాచర్యలను అధికారులు పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మాత్రమే విశ్వవిద్యాలయంలోకి అనుమతిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ మధ్య వివాదం, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ చేసిన నిరాహార దీక్షల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేశారు. ఏయూ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా పహారా కాస్తున్నారు.

News February 20, 2026

నిజాంసాగర్: “అమ్మకి అక్షర మాల”

image

నిజాంసాగర్ మండలం నర్సింగ్ రావుపల్లిలో నిర్వహించిన “అమ్మకి అక్షర మాల” కార్యక్రమంలో భాగంగా చదువు రాని మహిళలకు వయోజన విద్యాశాఖ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమం తొలి రోజు వాలంటరీ ద్వారా శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సంఘం అధ్యక్షురాలు సావిత్రి, VOA కృష్ణవేణి, వాలంటరీ సవిత, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అజయ్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

News February 20, 2026

వయసు కంటే వ్యక్తి.. కులం కంటే క్యారెక్టర్: మారిన పెళ్లి ట్రెండ్!

image

ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్‌లో పదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ‘జీవన్‌ సాథీ’ ప్రకారం.. 2016-2025 మధ్య పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టే సగటు వయసు 27 నుంచి 29 ఏళ్లకు చేరింది. నేటి యువత ‘సరైన వయసు’ కంటే ‘సరైన వ్యక్తి’నే ప్రిఫర్ చేస్తున్నారు. గతంలో 91% మంది కులానికి ప్రాధాన్యం ఇస్తే.. ఇప్పుడు అది 54%కి పడిపోయింది. ‘డ్యూయల్ ఇన్‌కమ్’ సంస్కృతి పెరిగింది. ఆర్థిక భద్రత కంటే ఎమోషనల్ బాండింగ్‌కే ఓటేస్తున్నారు.