News March 28, 2025
అసిఫాబాద్: కానిస్టేబుల్ను అభినందించిన ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో వరుస దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాగజ్ నగర్ పట్టణంలో ఇద్దరు దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర వహించిన ఐడి పాలిటి కానిస్టేబుల్ రాజును జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు. చాకచక్యంగా దొంగలను పట్టుకున్నందుకు పోలీస్ శాఖ తరపున ప్రశంస పత్రాన్ని అందించారు. వీరితో కాగాజ్నగర్ డిఎస్పీ రామానుజన్ ఉన్నారు.
Similar News
News March 31, 2025
మహబూబ్నగర్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి

మహబూబ్నగర్ రూరల్ మండల కేంద్రంలోని అన్ని గ్రామాల ముస్లిం ప్రజలు రంజాన్ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగ మత సామరస్యానికి, సర్వ మానవ సమానత్వానికి, పవిత్రకు, త్యాగానికి, దాతృత్వానికి, మతసామరస్యానికి ప్రతీకలని వారన్నారు. కుటుంబ సమేతంగా భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ఆకాంక్షించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
News March 31, 2025
MBNR: పండుగ రోజు LRS కోసం ఎవరూ రాలే..!

ఎల్ఆర్ఎస్ కోసం ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీ నేటితో ముగియనుంది. పండుగ రోజును సైతం లెక్కచేయకుండా మహబూబ్నగర్ నగరపాలిక సంస్థ అధికారులు కార్యాలయాన్ని తెరిచి ఉంచినా దరఖాస్తుదారులు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. పట్టణంలో 31,190 దరఖాస్తులు రాగా ఇప్పటివరకు కేవలం 1,800 మాత్రమే పరిష్కారమయ్యాయి. మిగిలిన వారు ఏమాత్రం స్పందించడం లేదు.
News March 31, 2025
గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.