News March 13, 2025

అసెంబ్లీని 20 రోజులు నడపాలని డిమాండ్‌: హరీశ్‌రావు

image

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కనీసం 20 రోజులు నడపాలని బీఏసీలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశామని హరీశ్‌రావు తెలిపారు. బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాలు లీక్ అయినట్లుగా అసెంబ్లీ బిజినెస్ ముందే లీక్ అవడంపై అభ్యంతరం తెలిపామన్నారు. ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం స్వయంగా స్పీకర్‌ను బల్డోజ్‌ చేస్తున్న విషయాన్ని బీఏసీలో లేవనెత్తామన్నారు.

Similar News

News March 13, 2025

మెదక్: బెస్ట్ ఉమన్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న DRO

image

మెదక్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్‌కు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డు అందజేశారు.

News March 13, 2025

మెదక్: గవర్నర్లు మారారు తప్ప.. ప్రసంగాలు మారలేదు: హరీశ్‌రావు

image

అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు.

News March 13, 2025

సాగునీటిపై రైతుల్లో అవగాహన పెంపొందించాలి: కలెక్టర్

image

వరి పంటకు సాగునీటి విషయమై రైతుల్లో అవగాహన పెంపొందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కౌడిపల్లి మండలం మమ్మద్ నగర్ గ్రామ శివారులో వ్యవసాయ నీటి వనరులను పరిశీలించారు. గతేడాది యాసంగిలో పంటల పరిస్థితి ఎలా ఉంది. ఏ రకం ధాన్యం సాగు చేస్తున్నారు. తదితర అంశాలను క్షేత్రస్థాయిలో ప్రస్తుత వరి పంట సాగునీరు అందే పరిస్థితి వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!