News March 19, 2025
అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే

అసెంబ్లీ ప్రాంగణంలో కొమురంభీం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మీ అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయంటే.. కారణం ముందుచూపు లేని కాంగ్రెస్ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. రైతుల పట్ల, రైతాంగం పట్ల ప్రభుత్వం తన బాధ్యత మర్చిపోయిందన్నారు. కాబట్టే పంటలు ఎండిపోయిన ప్రతి ఎకరానికి రూ. 25 వేల చొప్పున పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు.
Similar News
News March 19, 2025
KMR: విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనుల్లో అపశృతి చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు(42) అనే వ్యక్తికి బుధవారం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
News March 19, 2025
సిద్దిపేట: కస్తూర్భాను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

చేర్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతి రూం, కిచెన్ సందర్శించి మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు.
News March 19, 2025
కన్నుల పండువగా రాజరాజేశ్వర స్వామి రథోత్సవం

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. శివ కళ్యాణోత్సవంలో భాగంగా రాజరాజేశ్వరి స్వామి పార్వతి అమ్మవారు కళ్యాణం జరిగిన మూడోరోజు సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.