News February 27, 2025

అహోబిలంలో మార్చి 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

image

అహోబిలంలో మార్చి 2న కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ప్రధానార్చకులు కీడాంబి వేణుగోపాలన్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోయిల్ అంటే గుడి అని ఆళ్వార్ అంటే భక్తుడని తెలిపారు. కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే గుడిని శుద్ధి చేసే ప్రక్రియ అన్నారు. ఎగువ, దిగువ అహోబిలం క్షేత్రాలలో ఆ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామి దర్శనం ఉండదని తెలిపారు.

Similar News

News November 5, 2025

కర్నూలు కలెక్టరే టీచర్

image

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్‌లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

News November 5, 2025

11 కంపెనీలలో ఉద్యోగాలు.. ఎల్లుండే ఇంటర్వ్యూ

image

ఎమ్మిగనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 7న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ జాబ్ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న 18 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు మేళాలో పాల్గొనవచ్చన్నారు. 11 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అనంతరం మంగళవారం జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలు విడుదల చేశారు.

News November 4, 2025

లక్ష దీపోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

image

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించనున్న లక్ష దీపోత్సవ ఏర్పాట్లను స్థానిక ఎస్సై శివాంజల్‌తో కలిసి పరిశీలించారు. తుంగభద్ర నది తీరంలో పుణ్య హారతితో పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని శ్రీ మఠం అధికారులకు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్సై శివాంజల్‌కు సూచించారు.