News April 3, 2024

ఆంధ్రప్రదేశ్ తొలి స్పీకర్లు ఇద్దరూ నరసరావుపేట వారే

image

రాజకీయ చైతన్యానికి మారుపేరైన నరసరావుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇద్దరు తొలి స్పీకర్లను అందించింది. మద్రాసు నుంచి ఏపీ విడిపోయిన తర్వాత 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్ర తొలి స్పీకర్‌గా నరసరావుపేటకు చెందిన నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారు. అదేవిధంగా 2014లో తెలంగాణ, ఆంధ్రా విడిపోయిన నేపథ్యంలో నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నికయ్యారు.

Similar News

News February 16, 2026

బిల్ గేట్స్ అమరావతి పర్యటన హైలైట్స్

image

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి పర్యటన ఆసక్తికరంగా సాగింది.
• అమరావతి రాజధాని ప్రణాళికలను.. బ్లూ-గ్రీన్ కాన్సెప్టు, అత్యాధునిక పద్దతుల్లో ఫ్యూచర్ సిటీగా నిర్మిస్తున్న విధానాన్ని తెలుసుకున్న బిల్ గేట్స్ గ్రేట్ వర్క్ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను మెచ్చుకున్నారు.
• రాజధాని ప్రాంతంలో మొత్తంగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించే దిశగా.. ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు గేట్స్‌కు సీఎం వివరించారు.

News February 16, 2026

‘అంబటికి చట్టబద్ధమైన వసతులన్నీ కల్పించండి’

image

రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు స్థాయికి తగినట్లు చట్ట ప్రకారం కల్పించాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాలని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎం.కుముదుని ఆదేశించారు. వసతుల గురించి రాంబాబు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా సోమవారం ఆదేశాలు ఇచ్చారు. కాగా పోలీసులు రాంబాబు బెయిల్ పిటిషన్‌పై బుధవారం కుముదుని ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

News February 16, 2026

రాజధానిలో రాత్రి వేళ అందని వైద్యం..!

image

తుళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో రాత్రైతే వైద్యులు ఉండటంలేదని రోగులు అంటున్నారు. రాజధాని నిర్మాణ పనుల కోసం వచ్చిన కార్మికులతో పాటు స్థానిక ప్రజలు రాత్రివేళలో వైద్యశాలకు వెళితే సరైన వైద్యం అందించే నాధుడు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. రాత్రి సమయంలో ఆరోగ్య కేంద్రం వైద్యానికి దూరంగా ఉంటుందంటున్నారు. సమస్యపై ప్రజా ప్రతినిధులకు ఏ కరువు పెట్టినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు.