News August 4, 2024
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ త్రీమెన్ కమిటీ సభ్యుడిగా సుజయ్ కృష్ణ

విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ జనరల్ బాడి ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రస్తుత కార్యవర్గం రాజీనామాలు సమర్పించడంతో..వెంటనే త్రీ మెన్ కమిటీని అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బొబ్బిలికి చెందిన మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుకు కమిటీలో చోటు దక్కింది. ఎన్నికలు జరిగేంత వరకు త్రీ మెన్ కమిటీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్వహణ బాధ్యతలు కొనసాగిస్తుంది.
Similar News
News May 7, 2025
ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలి: కలెక్టర్

ఉపాధి వేతనదారులకు దినసరి వేతనం పెరిగేలా పనులు చేయించాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఉపాధి పనుల తీరు, వేతనదారులు అందుకుంటున్న సగటు వేతనంపై సమీక్షించారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని ఎండ తీవ్రత లేని సమయంలో పనులు నిర్వహించాలని చెప్పారు. ఉదయాన్నే వీలైనంత వేగంగా పని మొదలయ్యేలా చూడాలన్నారు. రెండుపూటలా కనీసం 6 గంటలు పనులు చేయించాలని ఆదేశించారు.
News May 7, 2025
అంతర్ జిల్లాల బదిలీలు చేయాలి: ఏపీటీఎఫ్

ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లా బదిలీలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.సింహాచలం, బి.జోగినాయుడు డిమాండ్ చేశారు. బొబ్బిలి పట్టణంలో శనివారం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు అంతర్ జిల్లాల బదిలీలు చేసి స్పోజ్ కేటగిరీలో ఎంటీఎస్ టీచర్లను పరిగణించాలన్నారు. 1998/2008 ఎంటీఎస్ టీచర్ల బదిలీలు కూడా రెగ్యులర్ టీచర్లతో చేయాలన్నారు. సింగిల్ టీచర్ పాఠశాలలకు రెండో టీచర్ను నియమించాలన్నారు.
News May 7, 2025
భోగాపురం మండలంలో ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెండ్

భోగాపురం మండలంలోని పోలిపల్లి, కౌలువాడ, లింగాలవలసలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ డ్వామా పీడీ శారదా కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. సామాజిక తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చర్యలు తీసుకున్నారని ఏపీఓ భాగ్యలక్ష్మి తెలిపారు. ఆయా గ్రామాల్లో ఉపాధి పనులకు ఆటంకం లేకుండా చర్యలు చేపట్టామని చెప్పారు.