News March 9, 2025

ఆకట్టుకున్న గద్వాల చేనేత ఉత్పత్తులు

image

దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో చేనేత కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనలతో కూడిన వివిధ అమృత మహోత్సవ కార్యక్రమంలో గద్వాల చేనేత ఉత్పత్తులను ప్రదర్శించారు. ఉత్పత్తిదారులు అక్కల శాంతారాం, మంత్రి సురేష్, శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రదర్శించిన గద్వాల జరీ చీరల ప్రాముఖ్యతను ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, తెలంగాణ గవర్నర్ విష్ణు దేవ్ వర్మ, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు స్వయంగా వివరించారు.

Similar News

News February 26, 2026

జగిత్యాల: కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్త్

image

జిల్లావ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.ప్రతి కేంద్రం వద్ద కట్టుదిట్టమైన బందోబస్త్, పెట్రోలింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంచినట్లు వెల్లడించారు.విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు.పరీక్షలు ముగిసే వరకు పోలీసు సిబ్బంది విధుల్లో ఉంటారని తెలిపారు.

News February 26, 2026

క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు అమలు చేయాలి: కలెక్టర్

image

పీఎం ధన ధాన్య కృషి యోజన అమలుపై గురువారం కేంద్ర అధికారి సిద్ధార్థ జైన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టర్‌లో కలెక్టర్‌తో పాటు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో రైతులకు పథకాలు మరింత చేరువ చేయాలన్నారు. ఆధునిక సాగు పద్ధతులపై దృష్టి సారించాలని, చియా పంటను జిల్లా అంతట విస్తరింపజేయాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 26, 2026

53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.5.30 లక్షల జరిమానా విధించినట్లు SP దామోదర్ గురువారం తెలిపారు. ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిందితులను మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జరిమానా విధించబడిందన్నారు. గడిచిన 3 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన సుమారు 110 మందికి జైలు శిక్ష పడిందని ఎస్పీ వెల్లడించారు.