News July 9, 2025
ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు: మంత్రి అనగాని

రైతులకు ఈ ఏడాది ఆగస్టు నుంచి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ప్రభుత్వం పంపిణీ చేయనున్నట్లు రెవెన్యూ & రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ బుధవారం తెలిపారు. సర్వే పూర్తయిన భూ యజమానులకు ఈ పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. మొదటి విడతగా 21.86 లక్షల మందికి ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి పాసు పుస్తకంపై క్యూఆర్ కోడ్, రైతు ఆధార్ వివరాలు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News July 9, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ జిల్లాలో కార్మిక సంఘాల సమ్మె విజయవంతం
✓ రేపు కొత్తగూడెంలో పవర్ కట్
✓ కలెక్టరేట్లో ఆధార్ క్యాంపునకు విశేష ఆదరణ
✓ Way2Newsలో కథనం.. అధికారులపై ఎమ్మెల్యే జారే అసహనం
✓ జిల్లా వ్యాప్తంగా 5 ఆధార్ సెంటర్లు: అడిషనల్ కలెక్టర్
✓ రేగులగండి చెరువులో సింగరేణి ఉద్యోగి గల్లంతు
✓ కొత్తగూడెం: వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్టు
✓ భద్రాచలం రామాలయ ఈవోపై జరిగిన దాడిని ఖండించిన తుమ్మల.
News July 9, 2025
‘ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

VMRDAకి చెందిన అన్ని కళ్యాణ మండపాల బుకింగ్లు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. బుధవారం VMRDA బాలల థియేటర్లో ఆయన ఆన్లైన్ బుకింగ్ సేవలను ప్రారంభించారు. ప్రజలకు VMRDA సేవలు పారదర్శకంగా కల్పించేందుకు ఆన్లైన్ సేవలు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆన్లైన్లోనే కళ్యాణమండపం రుసుము, తదితర వివరాలు ఉంటాయని పేర్కొన్నారు.
News July 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన సార్వత్రిక సమ్మె
> ఆకట్టుకున్న బాంజీపేట ప్రభుత్వ పాఠశాల
> జనగామ డీటీఓగా హుస్సేన్ బాధ్యతల స్వీకరణ
> రఘునాథపల్లి: రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
> పాలకుర్తి ఎంపీడీవోగా రవీందర్ బాధ్యతల స్వీకరణ
> ఇప్పగూడెం జడ్పీ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
> బతుకమ్మ కుంట నెల రోజులు మూసివేత
> జనగామ ఎమ్మెల్యేను పరామర్శించిన ఎంపీ