News August 10, 2025
ఆగస్టు 14న జిల్లాస్థాయిలో ప్రాచీన, గ్రామీణ క్రీడా పోటీలు

ఆగస్టు 14న జిల్లాస్థాయి ప్రాచీన గ్రామీణ క్రీడలు పోటీలు నిర్వహిస్తామని డీఎస్డీఓ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా ఏర్పాటై 75 ఏళ్లైన సందర్భంగా ఆ రోజు ఉదయం 9 గంటలకు కోడి రామమూర్తి క్రీడా ప్రాంగణంలో పురుషులు, మహిళలకు కర్రసాము పోటీలు ఉంటాయన్నారు. సంగిడి, ముద్దార్, పిల్లిమొగ్గలు కేవలం పురుషులకు మాత్రమేనని చెప్పారు.
Similar News
News August 12, 2025
శ్రీకాకుళం జిల్లాకు వర్షసూచన

శ్రీకాకుళం జిల్లాలో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు మంగళవారం తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతులు, ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థకు చేరుకున్న భవనాల్లో ఉండొద్దన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
News August 12, 2025
నులి పురుగులను నిర్మూలిద్దాం: జిల్లా కలెక్టర్

నులిపురుగులను నులిమేద్దామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో జరిగిన మాత్రల పంపిణీని కలెక్టర్ ప్రారంభించారు. నులిపురుగుల వలన పిల్లలు రక్తహీనతతో నీరస పడతారని వివరించారు. శారీరక, మానసిక, ఎదుగుదల లోపం వస్తుందన్నారు. పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలలో మాత్రలు పంపిణీ చేయాలన్నారు.
News August 12, 2025
మరోసారి తండ్రైన రామ్మోహన్ నాయుడు

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబంలో సందడి నెలకొంది. రామ్మోహన్ దంపతులకు మంగళవారం ఉదయం కుమారుడు జన్మించాడు. ఇప్పటికే ఒక కుమార్తె ఉండగా తాజాగా కుమారుడు జన్మించడంతో కుటుంబసభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.