News August 13, 2025
ఆచార్య ఎన్.జి.రంగా: భారత రైతాంగ ఉద్యమ పిత

భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రైతు నాయకుడు ఆచార్య ఎన్.జి.రంగా ఉమ్మడి గుంటూరు జిల్లా పొన్నూరు మండలం నిడుబ్రోలులో నవంబరు 7, 1900న జన్మించారు. ఆయనను భారత రైతాంగ ఉద్యమ పితగా పరిగణిస్తారు. 1930లో మహాత్మా గాంధీ పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటంలో చేరారు. ఆరు సార్లు జైలుకు వెళ్లారు. 1930-1991 వరకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 1991లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. జూన్ 9, 1995న మరణించారు.
Similar News
News August 14, 2025
మెట్ పల్లి: పదేళ్లలో వందేళ్ల విధ్వంసం: మధుయాష్కి గౌడ్

BRS పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. మెట్ పల్లిలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలో గతంలో తాను నిజామాబాద్ ఎంపీగా, కోరుట్ల ఎమ్మెల్యేగా రత్నాకర్ రావు ఉన్న హయంలో జరిగిన అభివృద్ధి తప్ప మళ్లీ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన కొనసాగుతుందన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నర్సింగరావు, కృష్ణారావు తదితరులున్నారు.
News August 14, 2025
బాసర ఆర్జీయూకేటీలో మాదకద్రవ్యాలపై అవగాహన

బాసరలోని ఆర్జీయూకేటీలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం నిర్వహించారు. మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా అందరూ కలిసికట్టుగా పోరాడాలని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్, ఎస్ఐ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. అనంతరం మాదకద్రవ్యాలను వాడబోమని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పేర్కొన్నారు.
News August 14, 2025
వేములవాడ: ‘యువత జీవితాలను నాశనం చేసుకోవద్దు’

వేములవాడ అర్బన్ మండలంలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, కమిషనరేట్ ఆఫ్ కాలేజీ ఎట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు కళాశాల యాంటీ డ్రగ్ కమిటీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు. వేములవాడ ఎక్సైజ్ సీఐ రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడి వారి విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రిన్సిపల్ టి.శంకర్ పేర్కొన్నారు.