News February 3, 2025

ఆజామ్ జాహి మిల్లుపై మావోయిస్టు పార్టీ లేఖ

image

వరంగల్ ఆజామ్ జాహి మిల్లు వస్త్ర పరిశ్రమకు చెందిన భూములపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ వెంకటేశ్ పేరుతో ములుగు జిల్లాలో లేఖ కలకలం సృష్టిస్తోంది. భూములపై పూర్తి హక్కు కార్మికులకు, వారి కుటుంబాలకు దక్కే వరకు పోరాటాలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. 2002లో 451 మంది కార్మికులకు బలవంతంగా వీఆర్ఎస్ ఇచ్చి మిల్లును మూసివేశారని తెలిపారు.

Similar News

News February 3, 2025

HYD: మీ పిల్లల్లో ఇలాంటి ప్రవర్తన గుర్తిస్తే జాగ్రత్త..!

image

మత్తుపదార్థాల వినియోగం యువతలో వేగంగా పెరుగుతుండటంతో రాచకొండ సీపీ సుధీర్ బాబు తల్లిదండ్రులకు ముఖ్యమైన హెచ్చరికను జారీ చేశారు. రేవ్‌పార్టీలు, అనుమానాస్పద మాత్రలు, రహస్య ప్రవర్తన వంటి ప్రారంభ లక్షణాలను గమనించడం వల్ల యువతను మత్తుపదార్థాల మాయాజాలం నుంచి కాపాడవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహపూర్వకంగా మాట్లాడంతో సమస్యను ముందే గుర్తించి నివారించవచ్చని అధికారులు సూచిస్తున్నారు.

News February 3, 2025

NRPT: ప్రజావాణి ఫిర్యాదులను పెండింగులో పెట్టవద్దు: ఎస్పీ

image

ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను పెండింగ్లో పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మొత్తం 5 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ చెప్పారు. ఆపదలో వుంటే డయల్ 100 ఫోన్ చేసి పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు.

News February 3, 2025

అనకాపల్లి: అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

image

వీఎంఆర్డీఏ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం అనకాపల్లి మండలం సిరసపల్లి, అంతకాపల్లి, బాటజంగాలపపాలెం గ్రామాల్లో వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్‌తో కలిసి పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. వారి వెంట సర్వే డిపార్ట్మెంట్ సహాయ సంచాలకులు గోపాలరాజు, ముఖ్య ప్రణాళిక అధికారి శిల్ప, ప్రధాన ఇంజనీర్ భవాని శంకర్ ఉన్నారు.