News February 18, 2025

ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్పీ

image

ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సోమవారం ఎస్పీ బిందు మాధవ్ సూచించారు. కాకినాడ ట్రాఫిక్ 1, 2 టౌన్ పోలీసులు నగరంలో ఓవర్ లోడ్ ప్యాసింజర్, స్కూల్ చిల్డ్రన్స్ ఆటోలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ లేని ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో 98 ఆటోలు సీజ్ చేసి కేసు నమోదు చేసి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

Similar News

News November 7, 2025

జూబ్లీ ఉపఎన్నిక.. రూ.3.33 కోట్ల నగదు సీజ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోడ్ నేపథ్యంలో ఇప్పటి వరకు రూ.3.33 కోట్లు నగదు, 701 లీటర్ల మద్యం, ల్యాప్‌టాప్‌లు, వాహనాలు వంటి ఉచిత బహుమతులు స్వాధీనం చేసుకున్నారు. నవంబర్‌ 7వ తేదీ ఉదయం వరకు మొత్తం 24 మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ఉల్లంఘన కేసులు నమోదు అయ్యాయి. స్వేచ్ఛా యుతంగా, న్యాయంగా ఎన్నికలు జరగేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు కఠిన నిఘా కొనసాగిస్తున్నాయి.

News November 7, 2025

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు ఉండవచ్చా?

image

స్మశానాలకు దగ్గర్లో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. స్మశానం నుంచి వెలువడే ప్రతికూల తరంగాలు నివాసితులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతారు. ‘దహన సంస్కారాలు జరిగే చోటు నుంచి కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు విడుదలై పర్యావరణం కాలుష్యమవుతుంది. ఈ గాలి ఆరోగ్యానికి హానికరం. నిరంతరం అశాంతి, నిరాశ భావాలను పెంచుతాయి’ అని సూచిస్తారు. <<-se>>#Vasthu<<>>

News November 7, 2025

HYD: ట్రబుల్ షూటర్ వచ్చేస్తున్నారు!

image

పితృవియోగంతో 10 రోజులు ప్రచారానికి దూరంగా ఉన్న మాజీ మంత్రి హరీశ్‌రావు మళ్లీ యుద్ధరంగంలోకి దిగనున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ముగింపు దగ్గర పడుతుండడంతో, ట్రబుల్ షూటర్‌గా ఆయన ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. BRS జైత్రయాత్రను జూబ్లీహిల్స్ నుంచే మొదలు పెట్టేందుకు, హరీశ్ వ్యూహరచన చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.