News October 14, 2025
ఆతిథ్యమిస్తున్నందుకు ఏపీ గర్విస్తోంది: మంత్రి అనిత

‘క్రికెట్ మైదానం మొదటిసారి చుసిన ఆ క్షణం, చుట్టూ విస్తారమైన పచ్చిక మైదానం, ప్రేక్షకులను చూసి వచ్చే ఆశ్చర్యం, ఏదైనా సాధ్యమే అన్న భావన. విశాఖలో ఒక పోలీసు అధికారి తన కుమార్తెకు ఆ అమూల్యమైన అనుభూతిని బహుమతిగా ఇచ్చారు. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, ఒక ప్రేరణకి వెలుగు. మహిళల ప్రతిభ, ఆశయాలకు వేదికగా ఈ మహోత్సవాన్ని ఆతిథ్యమిస్తున్నందుకు ఏపీ గర్విస్తోంది.’ అంటూ మంత్రి అనిత ‘X’లో పై ఫొటో షేర్ చేశారు.
Similar News
News October 14, 2025
పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్టర్మ్లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
News October 14, 2025
బద్దిపడగ జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎమ్ సస్పెండ్

సి్ద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల HM పద్మను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సర్వీస్ నుంచి సస్పెండ్ చేశామని DEO తెలిపారు. జిల్లా కలెక్టర్ పాఠశాల సందర్శనలో విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించకపోవడం, అమలు చేయకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.
News October 14, 2025
దౌల్తాబాద్: ‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి’

సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగ్రవాల్ మంగళవారం దౌల్తాబాద్ మండలం దొమ్మాట గ్రామంలో పర్యటించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. హై స్కూల్ను సందర్శించి డ్రై డే చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. పీహెచ్సీ, కస్తూర్బా హాస్టల్ను కూడా సందర్శించారు.