News July 5, 2025
ఆత్మకూరు ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం

నంద్యాల (D) ఆత్మకూరులో జరిగిన ఘటనపై టీడీపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరుకావాలని ఆదేశించింది. ఘటనకు కారణాలను వివరించాలని పేర్కొంది. కాగా ఎమ్మెల్యే బుడ్డా లేకుండా ఎంపీ శబరి నియోజకవర్గ పర్యటనకు సిద్ధమవడాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీలోని ఓ వర్గం ఆమె వాహనాన్ని అడ్డుకుంది. టీడీపీ నేత ప్రతాప్ రెడ్డిపై రాళ్లు విసిరింది.
Similar News
News July 5, 2025
కండక్టర్పై దాడి కేసులో ఇద్దరికి జైలు శిక్ష: సీఐ చిట్టిబాబు

ఆర్టీసీ కండక్టర్ విధులకు ఆటంకం కలిగించి, దాడి చేసిన ఇద్దరికి న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. సీఐ చిట్టిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. 2020లో తోట్లవల్లూరు నుంచి విజయవాడ వస్తున్న ఆర్టీసీ బస్సు కండక్టర్ సుదీర్పై వీరభద్రరావు, ప్రదీప్ కుమార్ దాడి చేశారు. ఈ ఘటనలో కోర్టు వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించింది.
News July 5, 2025
సిబ్బంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: ADB ఎస్పీ

ప్రతిరోజు వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ సిబ్బందికి సూచించారు. శనివారం ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన పరేడ్లో పాల్గొని సూచనలు చేశారు. సిబ్బంది ప్రతిరోజు వ్యాయామం చేయాలని, ప్రతి వారం నిర్వహించే పరేడ్లో పాల్గొని నిర్వహించే కవాతులో పరిపూర్ణత చెందాలన్నారు.
News July 5, 2025
ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్లో ఉద్యోగ అవకాశాలు

ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటీఐ, వెల్డర్ అభ్యర్థులకు ఖతర్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆ సంస్థ అధికారి షేక్ అబ్దుల్ ఖయ్యూం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత, అనుభవం కలిగిన అభ్యర్థులు ఈనెల 25వ తేదీలోగా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.