News November 19, 2025
ఆత్మాహుతి దాడి.. పశ్చాత్తాపం లేని రషీద్

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉమర్ నబీకి సాయం చేసిన అమీర్ రషీద్ అలీలో ఎలాంటి పశ్చాత్తాపం లేదని అతని లాయర్ స్మృతి చతుర్వేది వెల్లడించారు. దాడిలో పాల్గొన్న i20 కారును తానే రిజిస్టర్ చేయించినట్లు ఒప్పుకున్నారన్నారు. కశ్మీర్కు చెందిన రషీద్ను ఈ నెల 16న NIA <<18306148>>అరెస్టు<<>> చేసిన విషయం తెలిసిందే. సూసైడ్ బాంబింగ్లో అతనిదే కీలక పాత్ర అని అధికారులు చెబుతున్నారు.
Similar News
News April 15, 2026
IIGMలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో 26 రిసెర్చ్ స్కాలర్ పోస్టుల భర్తీకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నటిజం (IIGM), నవీ ముంబై.. దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 60% మార్కులతో MSc పూర్తి చేసిన వారు అర్హులు. వయసు 27 ఏళ్లు మించకూడదు. ఎగ్జామ్, ఇంటర్వ్యూతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అప్లికేషన్ ఫీజు – రూ.100. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి 30-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు iigm.res.in/careers చూడండి.
News April 15, 2026
న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్.. అమాయక మహిళలే టార్గెట్?

AP: గుంటూరు(D) తెనాలిలో న్యూడ్ వీడియో కాల్స్ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు మహిళలను ఇటీవల అరెస్టు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్రమార్కులు డబ్బు ఆశచూపి 80-100 మంది అమాయక మహిళలను ఈ రొంపిలోకి దింపినట్లు సమాచారం. వారికి ఒక్కో ఆన్లైన్ కాల్కు రూ.500-1,000 ఇస్తున్నట్లు తెలుస్తోంది. వీరికి అట్రాక్ట్ అయ్యి వచ్చే వ్యక్తుల నుంచి భారీగా వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
News April 15, 2026
విమాన వేంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటారు?

విమాన వేంకటేశ్వర స్వామి వారు శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయ గోపురం దక్షిణ భాగంలో దర్శనమిస్తారు. ఈ మూర్తి ఆలయ మూలవిరాట్టులాగే ఉంటుంది. శ్రీవారి భక్తుడైన తొండమాన్ చక్రవర్తి దీనిని ఏర్పాటు చేశారని వేంకటాచల మాహాత్మ్యం చెబుతోంది. భక్తులు సులభంగా దర్శించుకునేందుకు వీలుగా గోపురం వద్ద వెండి మకర తోరణం ఏర్పాటు చేశారు. అలాగే బాణం గుర్తు కూడా ఉంటుంది. ఈ స్వామివారిని దర్శించడం విశేషంగా భావిస్తారు.


