News April 8, 2025
ఆత్రేయపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో లారీ ఢీకొని గుర్తుతెలియని యువకుడు మంగళవారం మృతి చెందాడు. ఏపీ 37 3865 నంబర్ కలిగిన బైక్పై వెళ్తున్న యువకుడిని ఇసుక లోడుకు వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఆత్రేయపురం పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News November 1, 2025
నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్

నెల్లూరు లేడీ డాన్ అరుణకు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు సూర్యారావుపేట Ps లో ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను విజయవాడ పోలీసులు శుక్రవారం పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా కోర్టు 14 రోజుల రిమాండ్ వేయడంతో తిరిగి కేంద్ర కారాగారానికి తరలించారు.
News November 1, 2025
‘నా మీద జాలి వేయదారా.. నేను చనిపోతే వస్తావా?’

AP: విశాఖలో డిగ్రీ స్టూడెంట్ సాయితేజ్(21) <<18165774>>ఆత్మహత్య<<>> కేసులో వాట్సాప్ చాట్ బయటికొచ్చింది. మహిళా లెక్చరర్ పదేపదే అతడికి మెసేజ్లు చేస్తూ రిప్లై ఇవ్వడం లేదెందుకని నిలదీసింది. ‘నా మీద జాలి వేయదారా? శైలు చనిపోయినప్పుడు వెళ్లావ్ కదా.. నేను చనిపోతే వస్తావా?’ అంటూ బెదిరింపులకు దిగింది. ‘నువ్వు పిరికి’ అంటూ హేళన చేసింది. ఈ వేధింపులతోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని పేరెంట్స్ ఆరోపించారు.
News November 1, 2025
జగిత్యాల: ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్..!

జగిత్యాలలోని బాలికల జూనియర్ కళాశాలలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన కరీంనగర్ అర్బన్ బ్యాంకు పాలక మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలోని 2,105 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా, పోలింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. ఇదిలా ఉండగా షేర్ హోల్డర్ల లిస్టులో తమ పేరు ఉందని, అయినప్పటికీ ఓటర్ లిస్టులో పేరు రాలేదని పలువురు ఆరోపిస్తున్నారు.


