News August 22, 2025

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజ్

image

ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ గురువారం రాత్రి పర్యటించారు. ఆమె పర్యటనలను గోప్యంగా ఉంచారు. పట్టణంలోని టీటీడీసీలో ఆమె బస చేశారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలసి మీనాక్షి నటరాజన్ శ్రమదానం చేశారు. అనంతరం నాయకులతో మాట్లాడి జిల్లా రాజకీయ పరిస్థితుల గురించి ఆరా తీసినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ రెడ్డి, ఆత్రం సుగుణ, ఆడే గజేందర్ పాల్గొన్నారు.

Similar News

News August 22, 2025

ఆదిలాబాద్‌లో గణేశ్ ఉత్సవాలకు డీజేలు నిషేధం

image

ఆదిలాబాద్ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో డీజేలకు అనుమతి లేదని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. డీజేలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గణపతి మండపాల వద్ద సౌండ్ బాక్సులు, మైక్ సెట్ల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర నుంచి డీజేలను అద్దెకు తెచ్చి ఇచ్చేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

News August 21, 2025

‘జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు అవసరం’

image

ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కామర్ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ ఏర్పడడం వలన జిల్లా ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాలకి వారికి కూడా ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.

News August 21, 2025

ADB: అప్పుల బాధతో SUICIDE

image

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న బుధవారం తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.