News October 4, 2025
ఆదిలాబాద్లో కాంగ్రెస్ సన్నాహక సమావేశం

ఎన్నికల్లో అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుదని అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి ధీమా వ్యక్తం చేసారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. బేల, భోరజ్, జైనథ్ మండల నాయకులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. పోటీకి సిద్ధంగా ఉండే ఆశావహులు, వారి బలాబలాలపై సమీక్షించారు.
Similar News
News October 4, 2025
వారంలో 15 సైబర్ క్రైమ్ కేసులు: ADB SP

సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి సంప్రదించాలన్నారు. గతవారంలో 15 ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ప్రతివారం జిల్లా సైబర్ క్రైమ్ బృందం వారు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వివరించారు.
News October 4, 2025
ADB: కాంగ్రెస్ కసరత్తు షురూ..!

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్త ఎత్తుగడతో ముందుకువెళ్తోంది. జడ్పీ ఛైర్మన్ పదవులు కైవసం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఒక్కో జడ్పీటీసీ స్థానానికి నలుగురు చొప్పున ఎంపిక చేయాలని డీసీసీలకు ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జులు ప్రక్రియను పరిశీలిస్తున్నారు. బేల, భీంపూర్ మండలాల్లో ఇప్పటికే పలువురి దరఖాస్తులు తీసుకున్నారు. 6వ తేదీలోపు ప్రక్రియ పూర్తిచేస్తారని సమాచారం.
News October 4, 2025
ADB: ఆకతాయిల భరతం పట్టిన షీ టీమ్స్

దుర్గా నవరాత్రుల సందర్భంగా షీ టీమ్స్ కృషిని SP అఖిల్ మహాజన్ అభినందించారు. 119 హాట్స్పాట్ల్లో తనిఖీలు, 24 పెట్టీ కేసులు, 31 అత్యవసర కాల్స్కు స్పందించామని తెలిపారు. 20 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. దస్నాపూర్లో వేధింపులకు పాల్పడిన 9 మంది యువకులపై మావల PSలో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. మహిళలు ధైర్యంగా షీ టీంను ఆశ్రయించాలన్నారు.