News February 23, 2026

ఆదిలాబాద్‌లో తిరిగి ప్రారంభమైన పత్తి కొనుగోళ్లు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిపోయిన పత్తి కొనుగోళ్లు ఎంపీ గోడం నాగేష్ జోక్యంతో పునఃప్రారంభమయ్యాయి. కొనుగోళ్లు ఆగిపోవడంతో ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను బీజేపీ నాయకురాలు చిట్యాల సుహాసిని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే స్పందించిన ఎంపీ, అధికారులతో మాట్లాడి ప్రక్రియను పునరుద్ధరించారు. తమకు అండగా నిలిచిన నేతలకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 23, 2026

ఆదిలాబాద్: 67 మంది దరఖాస్తు.. కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు

image

అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. ‘రేవంత్ అన్న కా సహారా – మిస్కినో కే లియే’ పథకం కింద సోమవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమ్ సెలెక్షన్ కమిటీ (DLSSC) సమక్షంలో మోపెడ్ వాహనాల పంపిణీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈపథకానికి మొత్తం 67 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు.

News February 23, 2026

రేపు ఆదిలాబాద్‌లో కేటీఆర్ పర్యటన

image

ఈనెల 24న మంగళవారం ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నట్లు మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారన్నారు. పర్యటనలో భాగంగా జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు బీఆర్ఎస్ నాయకులను పరామర్శించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలని కోరారు.

News February 23, 2026

38 ఫిర్యాదులు స్వీకరించిన ఆదిలాబాద్ SP

image

బాధితుల పట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం అండగా ఉంటుందని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా ప్రజా ఫిర్యాదులను నేరుగా స్వీకరించారు. వెంటనే స్పందించిన ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని సూచించారు. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 38 ఫిర్యాదుదారులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు.