News March 7, 2025
ఆదిలాబాద్లో నేటి పత్తి ధర వివరాలు

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదన్నారు.
Similar News
News March 9, 2025
ADB: నేటి నుంచి గ్లాకోమా వారోత్సవాలు

ఈ నెల 9 నుంచి గ్లాకోమా వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఎంహెచ్ఓ రాథోడ్ నరేందర్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేస్తారని ఆయన పేర్కొన్నారు. గ్లాకోమాతో బాధపడే 40 సంవత్సరాలు పైబడ్డ వారంతా ఆయా ఆస్పత్రుల్లో నిర్ధారణ పరీక్షలు చేయించుకొని చికిత్సలు పొందాలని సూచించారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్నారు.
News March 9, 2025
ఉట్నూర్: ఈ నెల 16న ఈఎంఆర్ఎస్ ప్రవేశ పరీక్ష

ఆదిలాబాద్ జిల్లాలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్షను ఈ నెల 16న నిర్వహిస్తున్నట్లు గిరిజన గురుకులాల ఆర్సీఓ అగస్టిన్, ఉట్నూర్ ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపల్ సౌరబ్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, సిర్పూర్ కాగజ్నగర్లో పరీక్షా సెంటర్లు ఉంటాయన్నారు. విద్యార్థులు ఈ నెల 7 నుంచి ఆన్లైన్లో హాల్ టికెట్లను దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 8, 2025
ADB: LRS సందేహాల నివృత్తికి హెల్ప్ డెస్క్ ఏర్పాటు

అనుమతి లేని లే అవుట్ క్రమబద్ధీకరణ (LRS) దరఖాస్తులను పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు హెల్ప్ డెస్క్ను కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. సందేహాలు ఉన్నవారు సెల్ ఫోన్ 8309959444 నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ నెల మార్చి 31 లోగా క్రమబద్ధీకరణ రుసుం చెల్లించే వారికి 25శాతం రిబేట్ వర్తిస్తుందని పేర్కొన్నారు.